Begin typing your search above and press return to search.

ఎన్నార్సీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ !

By:  Tupaki Desk   |   27 Dec 2019 11:57 AM GMT
ఎన్నార్సీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్ !
X
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది . జనవరి 22న జరగనున్న మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుండే కసరత్తులు పెట్టాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నద్ధం అవుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు శుక్రవారం తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రసంగించారు. మునిసిపల్ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేటీఆర్ అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంలో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై రాష్ట్ర కమిటీ సభ్యులతో చర్చించారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు లేవకుండా గట్టిగా దెబ్బ కొట్టాలని సూచించారు. అయితే ముందుగా అభ్యర్థుల ఎంపిక సవాల్‌ గా మారిన పరిస్థితిలో, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేయడంలో ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్రి సభ్య కమిటీని వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు .

అయితే , టి ఆర్ ఎస్ చేసిన అభివృద్ధి ఫలాలే మునిసిపల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీకి పట్టం కడతాయని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ ఎస్‌ కే పట్టం కట్టారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోందని ఎద్దేవా చేశారు . మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు.

తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్‌ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌ అందించామని, 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌నే ఆశీర్వదిస్తారని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమావేశంలో అయన ఎన్నార్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీని, సిటిజన్‌ షిప్ యాక్టును టీఆర్ ఎస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో క్లుప్తంగా వివరించారు. ఏ ఒక్కరి కోసమో పార్టీ స్టాండ్ వుండదని, అన్ని ఆలోచించిన తర్వాతనే పార్టీ పార్లమెంటరీ కమిటీ తగిన నిర్ణయం తీసుకుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.