Begin typing your search above and press return to search.

ఇంగ్లాండ్​ క్రికెటర్లతో వరస గొడవలు.. మొన్న కోహ్లీ.. నిన్న పాండ్యా..!

By:  Tupaki Desk   |   24 March 2021 8:30 AM GMT
ఇంగ్లాండ్​ క్రికెటర్లతో వరస గొడవలు.. మొన్న కోహ్లీ.. నిన్న పాండ్యా..!
X
ఇంగ్లాండ్​ క్రికెటర్లతో మనవాళ్లకు వరసగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే బట్లర్​, కోహ్లీకి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి గొడవ చెలరేగింది. తాజాగా పాండ్యా, టామ్​ కరన్​ మధ్య గొడవ చోటుచేసుకున్నది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కృనాల్ పాండ్యా వన్డే సీరిస్​తోనే అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్​లోనే 31 బంతుల్లో 58 పరుగులు సాధించి నాటౌట్​గా నిలిచాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సులతో మెరుపు ఇన్సింగ్స్​ ఆడాడు.

అయితే ఇన్సింగ్స్​ చివర్లో టామ్​ కరన్​కు.. కృనాల్​ పాండ్యాకు మధ్య వివాదం చెలరేగింది. కరన్​కు పాండ్యా కూడా దీటుగా సమాధానం చెప్పాడు.ఇన్నింగ్స్ 49వ ఓవర్ వేసిన టామ్ కరన్ బౌలింగ్‌లో ఐదో బంతిని ఫీల్డ్ అంపైర్ పద్మనాభన్ వైడ్‌గా ప్రకటించాడు. దాంతో టీమిండియా‌కి ఓ ఎక్స్​ట్రా వచ్చింది.

అయితే ఆ టైంలోనే టామ్​ కరన్​ కృనాల్ పై నోరు పారేసుకున్నాడు. ఈ వైడ్​ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. ఫీల్డ్​ అంపైర్​ జోక్యం చేసుకొని సర్దిచెప్పినా వివాదం సద్దుమణగలేదు. అయితే కృనాల్​ కూడా ఏదో సైగ చేశాడు.

మధ్యలోకి కీపర్​ బట్లర్​ కూడా ఎంట్రీ ఇవ్వడంతో వివాదం మరింత పెద్దదైంది.

బట్లర్​ కృనాల్​ వైపు సీరియస్​గా చూస్తూ రెచ్చగొట్టాడు. అంతేకాక టామ్​ కరన్​కు ఏదో సూచనలు ఇచ్చాడు.

డగౌట్‌‌లో కూర్చుని ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నాడు. ఆ తర్వాత టీవీ అంపైర్​కు కంప్లైంట్ ఇచ్చాడు. తొలి వన్ డే మ్యాచ్ లో టీం ఇండియా 317 పరుగుల భారీ స్కోరు చేయగా లక్ష్య ఛేదనలో తడ బడ్డ ఇంగ్లాండ్ 66 పరుగుల తేడాతో ఓటమి చెందింది.