Begin typing your search above and press return to search.

జ‘‘గన్’’ వాదన మళ్లీ తుస్సుమందా?

By:  Tupaki Desk   |   19 Dec 2015 7:11 AM GMT
జ‘‘గన్’’ వాదన మళ్లీ తుస్సుమందా?
X
ప్రొసీజర్స్ విషయంలో అవగాహన చాలా అవసరం. ఆ విషయంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా అభాసుపాలు కావటం ఖాయం. అదేం సిత్రమో కానీ.. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయితే చాలు.. తన అవగాహనారాహిత్యాన్ని పదే పదే బయటపెట్టుకునే ఏపీ విపక్ష నేత జగన్ మరోసారి తప్పులో కాలేశారు. వాదన వినిపించే విషయంలో ప్రత్యర్థుల్ని డిఫెన్స్ లో పడేయటం వదిలేసి తానే డిఫెన్స్ లో పడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయటంపై జగన్ నిరసన తెలిపిన ఆయన.. ఈ సందర్భంగా అధికారపక్ష సభ్యులు లేవనెత్తిన కరణం బలరాం ఇష్యూపై తన వాదనను వినిపించారు. తాను చెప్పిన మాటలకు అధికారపక్షం ఎలాంటి కౌంటర్ ఇస్తుందన్న విషయంలో దూరంగా ఆలోచించకపోవటంతో జగన్ దొరికిపోయిన పరిస్థితి.

అదెలానంటే.. రోజా విషయంలో కరణం బలరాం విషయాన్ని అధికారపక్షం నేతలు ప్రస్తావిస్తున్నారని.. అయితే.. కరణం బలరాం నాడు అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత. అయన్ను ఎతిక్స్ కమిటీ ముందు హాజరై.. వివరణ ఇవ్వాలని కోరారని.. అయితే.. కరణం బలరాం హాజరు కాకపోవటంతో ఆయనపై ఆర్నెల్లు వేటు వేశారని చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. కరణం విషయంలో ఎక్కడో జరిగిందని.. దాని గురించి వివరాలు తెలుసుకోవటానికి ఎథిక్స్ కమిటీ ముందకు రావాలని కోరతారని.. కానీ.. రోజా ఇష్యూ అందుకు భిన్నమని.. సభలోనే జరిగిందని.. అందరూ చూశారని.. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి విచారణ అవసరం లేదని.. అందుకే సస్పెండ్ చేసినట్లుగా చెప్పారు. జగన్ వాదనపై స్పీకర్ స్పందించిన తర్వాత చూసినప్పుడు.. జగన్ తన వాదనతో మరోసారి తప్పలో కాలేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.