Begin typing your search above and press return to search.

ఎమ్మార్వోపై కేకే కూతురు విజయలక్ష్మీ దౌర్జన్యం

By:  Tupaki Desk   |   20 Jan 2021 10:03 PM IST
ఎమ్మార్వోపై కేకే కూతురు విజయలక్ష్మీ దౌర్జన్యం
X
బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మీ దౌర్జన్యం చేసినట్టు తాజాగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు వీడియోలు వైరల్ అయ్యాయి.

షేక్ పేట కార్యాలయంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ విజయలక్ష్మి రెచ్చిపోయిన వైనం వెలుగుచూసింది. తాను కేకే కూతురి అంటూ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డిపై విజయలక్ష్మి దాడి చేశారు.

దీంతో పోలీసులకు ఎమ్మార్వో శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. హైకోర్టుకు వెళ్లాల్సి ఉండగా.. తనను అడ్డుకొని విజయలక్ష్మీ దుర్భాషలాడిందని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదులో విజయలక్ష్మి అనుచరులు కూడా తనను నిర్బంధించారని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.