Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ కుర్రాడి మీద గుంటూరు కుర్రాడు గెలిచాడు

By:  Tupaki Desk   |   23 Jun 2017 8:56 AM GMT
హైద‌రాబాద్ కుర్రాడి మీద గుంటూరు కుర్రాడు గెలిచాడు
X
అంత‌ర్జాతీయ పోటీలో ఒకేదేశానికి చెందిన వారు పోటీ ప‌డ‌టం కాస్తంత త‌క్కువే. అలాంటిది ఇద్ద‌రు తెలుగు కుర్రాళ్లు త‌ల‌ప‌డిన వైనం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. తాజాగా జ‌రుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ సూప‌ర్ సిరీస్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్.. భార‌త్‌కు చెందిన మ‌రో తెలుగు ఆట‌గాడు సాయి ప్ర‌ణీత్ తో త‌ల‌ప‌డ్డాడు.

వీరిద్ద‌రి మధ్య సాగిన పోరు ఆస‌క్తిక‌రంగా సాగింది. దాదాపు 43 నిమిషాల పాటుసాగిన ఈ మ్యాచ్‌లో రెండు వ‌రుస సెట్ల‌లో గేమ్‌ను గెల్చుకున్నాడు కిదాంబి శ్రీకాంత్‌.

నువ్వానేనా అన్న‌ట్లు సాగిన మ్యాచ్‌ లో సాయి ప్ర‌ణీత్ పై శ్రీకాంత్ పైచేయి సాధించాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఇరువురు ఇటీవ‌లే త‌ల‌ప‌డ్డారు. సింగ‌పూర్ ఓపెన్ ఫైన‌ల్ లో ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరు సాగ‌గా.. అప్పుడు సాయి ప్ర‌ణీత్ విజ‌యం సాధించాడు. తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్ సూప‌ర్ సిరీస్ లో మాంచి దూకుడు మీద ఉన్న శ్రీకాంత్‌.. సాయి ప్ర‌ణీత్ ను అల‌వోక‌గా ఓడించాడు. సెమిస్‌ కు దూసుకెళ్లాడు. సాయి ప్ర‌ణీత్ హైద‌రాబాద్ కుర్రోడు కాగా.. కిదాంబి శ్రీకాంత్ ది గుంటూరు కావ‌టం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/