Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదం.. ఖుష్బూనే చంపేందుకేనా?

By:  Tupaki Desk   |   19 Nov 2020 12:50 PM GMT
రోడ్డు ప్రమాదం.. ఖుష్బూనే చంపేందుకేనా?
X
ప్రముఖ సినీ తార, బీజేపీ నాయకురాలు కారుకు ఇటీవల ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె కారు నుజ్జునుజ్జు అయిపోయింది. తమిళనాడులోని తిరుచ్చి జాతీయ రహదారి మధురాంతకం సమీపంలో ఆమె కారును కంటైనర్ లారీ ఊహించని విధంగా ఢీకొట్టింది.

ఈ యాక్సిడెంట్ లో కారు వెనుక భాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారు ముందు సీటులో కూర్చున్న ఖుష్బూ షాక్ కు గురై వెంటనే కేకలు వేయడంతో డ్రైవర్ మురగన్, స్థానికులు ఆమెను కారు నుంచి వెలికి తీశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఖుష్బూను విచారించారు. ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఖుష్బూ బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నిర్వహించిన వేల్ యాత్రలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ సందర్భంగా ఖుష్బూ మాట్లాడుతూ.. తనను హత్య చేయడానికి కుట్ర పన్నారని.. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే ఓ పథకం ప్రకారం తనను చంపేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. తాను బీజేపీలో చేరినప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. వాటికి తాను భయపడనని ఆమె స్పష్టం చేశారు.