Begin typing your search above and press return to search.

కీలక నిర్ణయం.. మూడో డోసు తీసుకోకపోతే జీతం కట్..!

By:  Tupaki Desk   |   26 Jan 2022 12:30 AM GMT
కీలక నిర్ణయం.. మూడో డోసు తీసుకోకపోతే జీతం కట్..!
X
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కేవలం కొద్ది రోజుల్లోనే కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కేవలం ఈ ఒక్క రోజులోనే సుమారు 30 లక్షలకు పైగా కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేసుల సంఖ్య ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క లాగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో కొత్త కేసులు ఇంకా తగ్గలేదు.

ఈ రోజు కూడా సుమారు నాలుగు లక్షల ఆరవై వేల కేసులు బయటపడినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరో వైపు ఫ్రాన్స్ లో కూడా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. సమారు లక్షకు పైగా కేసులు ఆ దేశంలో బయటపడ్డాయి. అయితే ప్రతి చోటా వైరస్ కేసుల సంఖ్య నానాటికి పెరగడం ఆయా దేశాల వైద్యాధికారులను ఆందోళనకు గురి చేస్తోంది.

మరోవైపు మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరువేల మరణాల్లో నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఎక్కువ కేసులు నమోదు అవ్వడంలో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో కూడా నేడు సుమారు రెండు లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈ సారి మరణాలు సంఖ్య కూడా పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రారంభించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందిని తక్కవ రోజుల్లో కవర్ చేయగలిగితే వైరస్ నుంచి వారికి రక్షణ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. టీకా తీసుకున్న వారులో వైరస్ ప్రభావం ఎక్కువగా లేకపోవడం కూడా ఒకింత ఊటరటనిస్తుంది. అలాకాకుండా టీకా తీసుకొని వారు చాలా మంది వైరస్ సోకితే ఆసుపత్రి పాలవుతున్నారని అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రెండు డోసులు పూర్తి అయిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోసు ఇస్తున్నారు. వీరితో పాటే అరవై ఏళ్లు దాటిన వారికి, చిన్న పిల్లలకు కూడా ప్రభుత్వం ఉచితంగా టీకా పంపిణీ చేస్తుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కసరత్తులు చేస్తున్నాయి. కానీ చాలామంది ఇంకా టీకా అంటే వెనకడుగు వేస్తున్నారు.

ఇలాంటి వారి కోసం మధ్యప్రదేశ్ లోని ఓ కలెక్టర్ వినూత్నంగా ఆలోచించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం వైరల్ గా మారంది. అది ఏంటంటే.. అర్హత ఉండి కూడా ఎవరైతే బూస్టర్ డోసు తీసుకోకుండా ఉంటారో వారి జీతాలను నిలిపి వేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయనే మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లా కలెక్టర్ మనీష్ సింగ్. ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం బూస్టర్ డోసు తీసుకోవాల్సిన వారు ఇండోర్ లో సుమారు 90 వేలకు పైగా ఉన్నారు. అయితే జనవరి రెండో వారం వరకు కేవలం సగం మంది మాత్రమే ఈ డోసు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎక్కువ మంది బూస్టర్ డోసు లేద ప్రికాషన్ డోసు తీసుకునేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు