Begin typing your search above and press return to search.

రెండేళ్ల క్రితం ఐసిస్ లో చేరిన మనోడు చచ్చిపోయాడు

By:  Tupaki Desk   |   1 Aug 2019 7:33 AM GMT
రెండేళ్ల క్రితం ఐసిస్ లో చేరిన మనోడు చచ్చిపోయాడు
X
ఉన్మాదంతో చెప్పుడు మాటలు విని.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చి ఐసిస్ లో చేరిన కేరళీయుడి ఉదంతం విషాదంగా మారింది. రెండేళ్ల క్రితం కేరళకు చెందిన ఒక ముస్లిం యువకుడు ఐసిస్ లో చేరాడు.కనిపించకుండా పోయిన అతగాడు ఐసిస్ లో చేరినట్లుగా గుర్తించాడు. దీంతో.. తీవ్ర వేదనలో మునిగిపోయారు ఆ యువకుడి తల్లిదండ్రులు.

తాజాగా ఆ తల్లిదండ్రుల సెల్ కు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది. అల్లా సేవలో తరించాలనే మీ సోదరుని కోరిక నెరవేరింది.. పది రోజుల క్రితం మీ సోదరుడు అమరుడయ్యాడు.. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే మీకే ప్రమాదం అంటూ మలయాళంలో వచ్చిన వాట్సాప్ మెసేజ్ తో ఆ తల్లిదండ్రులు అవాక్కు అయ్యారు.

కేరళలోని మలప్పురం జిల్లా ఇడప్పల్ కు చెందిన ముహాసిన్ వ్యవహారం తాజాగా విషాదంలో ముగిసింది. తాజాగా వచ్చిన వాట్సాప్ సందేశం చూస్తే.. అతనితో పాటు ఉన్న వ్యక్తికి మలయాళం వచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాట్సాప్ లో మెసేజ్ తో పాటు.. చనిపోయిన వ్యక్తి ఫోటోను కూడా పంపారు. తాజా మెసేజ్ చూస్తే.. ముహాసిన్ తో పాటు మరో కేరళ వ్యక్తి కూడా ఐసిస్ లో పని చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.