Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ లో పెళ్లి ..స్పీడ్‌ పోస్ట్ ‌లో తాళి !

By:  Tupaki Desk   |   27 May 2020 7:15 AM GMT
ఆన్ లైన్ లో పెళ్లి ..స్పీడ్‌ పోస్ట్ ‌లో తాళి !
X

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య ఈ మహమ్మారి. ఈ వైరస్ దెబ్బకి ప్రతి ఒక్కరు వణికిపోతున్నారు. ఇకపోతే ఈ వైరస్ కారణంగా దేశంలో అనేక పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. ఈ కష్టకాలంలో కొంతమంది చాలా నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటుంటే ..మరికొందరు వీడియో కాలింగ్‌ ద్వారా తమ సన్నిహితులు చూస్తుండగా వివాహ బంధంతో ఒకటవుతున్నారు. మొత్తంగా ఈ వైరస్ కారణంగా పెళ్లి చేసుకోవాలనుకునేవారి కష్టాలు అన్ని ఇన్ని కావు.

తాజాగా కేరళకి చెందిన ఓ జంట ..తమ పెళ్లిని చాలా విన్నూతనంగా జరుపుకున్నారు. కేరళ కి చెందిన వీరు ..పూణే లో ఒక్కటైయ్యారు. రళ ఉన్న వధూవరుల కుటుంబాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి సన్నిహితులు జూమ్‌ యాప్‌ ద్వారా ఈ వేడుకను వీక్షించారు. అయితే పెళ్లికి కావాల్సిన పవిత్రమైన మంగళసూత్రాన్ని వధూవరుల తల్లిదండ్రులు కేరళ నుంచి స్పీడ్‌ పోస్ట్‌ లో పంపించడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే .. కేరళకు చెందిన విఘ్నేష్‌, అంజలిలు పుణెలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఏడాది క్రితమే వీరు పెళ్లి నిశ్చయమైంది. అయితే ఇప్పుడు లాక్‌ డౌన్‌ కొనసాగుతుండటం తో వారు పుణెలో ఉండాల్సి వచ్చింది. అయితే ఇందుకు వారు ఏ మాత్రం నిరాశ చెందలేదు. అయితే . ముందుగా నిర్ణయించిన రోజునే పెళ్లి చేసుకోవాలనే వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వరుడు విఘ్నేష్‌ నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో ఈ వివాహం జరిగింది. ఇందుకు పుణెలోని విఘ్నేష్‌, అంజలి ఫ్రెండ్స్‌ తగిన ఏర్పాట్లు చేశారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్నేహితులు - బంధువులు ఆన్‌ లైన్ ‌లో మా పెళ్లిని వీక్షించారు. ఇది చాలా భిన్నమైన అనుభూతి.. కానీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని విఘ్నేష్‌ అన్నారు. లాక్‌ డౌన్‌ ప్రారంభమైన కొత్తలో మే తొలి వారంలోనైనా మేము ఇళ్లకు చేరుకుంటామని అనుకున్నాం. ఆ తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఇళ్లకు వెళ్లలేమని అర్థమైంది. అయినప్పటికీ మేము మా పెళ్లిని వాయిదా వేసుకోవాలని అనుకోలేదు అని అంజలి చెప్పారు. అలాగే సమయానికి మంగళసూత్రం డెలివరీ చేసిన ఇండియన్‌ పోస్టల్‌ శాఖకు నూతన దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.