Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ లో విజయంపై స్పందించిన కవిత

By:  Tupaki Desk   |   24 Oct 2019 5:30 PM IST
హుజూర్ నగర్ లో విజయంపై స్పందించిన కవిత
X
ఎవ్వరూ ఊహించని విధంగా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ అద్భుత విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారు.

20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న హుజూర్ నగర్ టీఆర్ఎస్ సొంతం కావడంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత స్పందించారు. ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

కేసీఆర్ గారిపైన అంచలంచెలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్ఎస్ కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్ నగర్ ప్రజలకు ధన్యవాదాలని కవిత ట్వీట్ లో తెలిపారు.

ఇక ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు అని.. జైతెలంగాణ జై కేసీఆర్ అంటూ కవిత ముగించారు.