Begin typing your search above and press return to search.

పీఏతో బూట్లు తొడిగించుకున్న మాజీ ముఖ్యమంత్రి..

By:  Tupaki Desk   |   7 Feb 2020 4:55 PM GMT
పీఏతో బూట్లు తొడిగించుకున్న మాజీ ముఖ్యమంత్రి..
X
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను మరోసారి వివాదం వెంటాడుతోంది. ఓ ఆలయం వెలుపల తన పీఏతో బూట్లు తీయుంచుకుంటూ కెమెరాకు చిక్కారు సిద్దరామయ్య. దీంతో ఆ వీడియో వెంటనే సోషల్ మీడియా లో వైరల్ అయింది. అంతేకాదు పీఏ ఖాళీగా ఉన్నాడని మళ్లీ ఆయనతో బూట్లు తొడిగించుకున్నారు. ఆ సమయం లో ఆయన పక్కనే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నా ఆ విషయం పట్టించుకోలేదు. దీంతో ఈ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది.

కర్ణాటకలోని చామరాజనగర తాలుకా నల్లూరు మూళేయల్లి మల్లిగమ్మ దేవాలయం రాజగోపురం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సిద్దరామయ్య.. ఆలయంలోకి వెళ్లే ముందు తన పీఏతో బూట్లు తీయించుకొని, ఆ తర్వాత ఆలయం నుంచి బయటకొచ్చాక మళ్ళీ బూట్లు తొడిగించుకున్నారు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టేయడంతో సిద్ద రామయ్య పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు ఇప్పటికే తెలిసిన వారి దగ్గర లక్షల రూపాయల విలువైన వాచ్ బహుమతిగా తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ సీఎం సిద్దరామయ్య. ఈ పరిస్థితుల్లో ఈ వీడియో వైరల్ కావడం హాట్ ఇష్యూగా మారింది. దీంతో.. మరోసారి కర్ణాటక ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న మాజీ సీఎం సిద్దరామయ్య మీద విమర్శలు గుప్పించడానికి అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు మంచి అస్త్రం దొరికినట్లయింది.