Begin typing your search above and press return to search.

తెలంగాణ‌ కొత్త గవర్నర్ గా బీజేపీ నేత‌?

By:  Tupaki Desk   |   3 Jan 2017 8:04 AM GMT
తెలంగాణ‌ కొత్త గవర్నర్ గా బీజేపీ నేత‌?
X
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ బ‌దులుగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ సీటులో కొత్త నాయ‌కుడు రానున్నారా? ఈ మేర‌కు బీజేపీ నేత‌లు పావులు క‌దుపుతున్నారా? భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత - కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ గా సేవలందిస్తున్న డీ హెచ్ శంకరమూర్తి తెలంగాణ గవర్నర్‌ గా నియమితం కానున్నారా? అంటే ఢిల్లీలోని బీజేపీ నేత‌లు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే వివిధ రాజ‌కీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ రూపంలో గ‌వ‌ర్న‌ర్ మార్పుపై కేంద్ర ప్ర‌భుత్వానికి విన‌తులు వెళ్లిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో న‌ర‌సింహ‌న్ స్థానంలో శంకరమూర్తి నియామకానికి ప్ర‌ధాన‌మంత్రి మోడీ పచ్చజెండా ఊపినట్టు సమాచారం. గత వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాలు శంకరమూర్తితో చర్చించి, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. శంకరమూర్తి నియామకంపై మరో రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా జారీ అవుతాయని అంటున్నారు. అయితే ఈ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఎలాంటి ఆదేశాలు వెలువ‌డలేదు. ఈ నేప‌థ్యంలో ఈ వార్త‌ విశ్వ‌స‌నీయతపై సందేహం నెల‌కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/