Begin typing your search above and press return to search.

అందుకే ప్రజలు నీ సీటు మారుస్తున్నారు బాబూ

By:  Tupaki Desk   |   2 May 2019 11:58 AM IST
అందుకే ప్రజలు నీ సీటు మారుస్తున్నారు బాబూ
X
ప్రధాని నరేంద్రమోడీపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యక్తిగత విమర్శలపై ఘాటుగా స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. మోడీ గంటకో డ్రెస్ మారుస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకే డ్రెస్ తో ఉంటున్నారని చెప్పుకొచ్చాడు. మోడీ గారు గంటకో డ్రెస్ మారుస్తారో తెలియదు కానీ.. బాబు మాత్రం ఊసరవెల్లి కన్నా ఘోరంగా రంగులు మారుస్తారు అంటూ ట్విట్టర్ లో నిప్పులు కురిపించారు. నిమిషానికి ఒక మారుస్తావ్ అంటూ బాబును ఎండగట్టారు.

నిజాయితీగా ఉండే అధికారుల సీటు మారుస్తాడని.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్ల పార్టీ మారుస్తావ్ అంటూ బాబుపై కన్నా విరుచుపడ్డారు. అందుకే ప్రజలు ఈ ఎన్నికల్లో చంద్రబాబు సీటు మారుస్తున్నారంటూ సెటైర్ వేశారు.

చంద్రబాబు తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై నోరుపారేసుకున్నాడు. మోడీకి డ్రెస్ పిచ్చి ఉందని.. గంటకో డ్రెస్ మారుస్తారని విమర్శించారు. డ్రెస్ లపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని ఘాటు విమర్శలు చేశారు. దీనికి కౌంటర్ గానే ఊసరవెల్లి, చంద్రబాబు ఫొటోలను పక్కపక్కనే పెట్టి కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ లో బాబుపై తీవ్ర విమర్శలు చేశారు.