Begin typing your search above and press return to search.

ప‌వ‌న్‌....నీకు బురద అంటుంతోంది!

By:  Tupaki Desk   |   4 April 2017 9:57 AM GMT
ప‌వ‌న్‌....నీకు బురద అంటుంతోంది!
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పిదాల‌కు ఆయ‌న మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన సైతం అబాసుపాలు కావ‌స్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం ప‌వ‌న్ ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం పూర్తి స్థాయి రాజ‌కీయ‌వేత్త‌గా మారిన ప‌వ‌న్ ప్ర‌శ్నించేందుకు తాను పాలిటిక్స్‌ లోకి వ‌చ్చాన‌ని తెలిపారు. అయితే వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి అనంతరం పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు నలుగురికి ఏపీ కేబినెట్‌ లో తాజాగా చోటు కల్పించిన తీరుపై ఏ మాత్రం త‌న స్పంద‌న వెలువ‌రించ‌లేదు. దీంతో ప‌వ‌న్‌ పై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

తాజాగా మాజీ ఎమ్మెల్సీ - వైసీపీ నేత కందుల దుర్గేష్ జన‌సేన అధిప‌తి తీరును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వ‌డంతో పాటు రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ​ ఎందుకు స్పందించడం లేదని కందుల దుర్గేష్‌ సూటిగా ప్రశ్నించారు. త‌ప్పును త‌ప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్ప‌డం త‌న నైజం అని చెప్పిన ప‌వ‌న్ భార‌త రాజ్యాంగాన్ని అప‌హాస్యం పాలు చేస్తున్న‌ప్ప‌టికీ ఎందుకు నోరు మెద‌ప‌డం లేద‌ని దుర్గేష్ నిల‌దీశారు. బాబు విధానాల‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తు ఇస్తున్నారా అని అనుమానం వ్య‌క్తం చేశారు. పార్టీలు మార్పించి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన చంద్ర‌బాబు తీరును, జ‌నం కోసం ఉన్నాన‌ని చెప్పుకొంటూ ప్రశ్నించ‌కుండా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు. స‌రైన స‌మయంలో వారి ప‌ట్ల ప్ర‌జ‌లు స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తార‌ని దుర్గేష్ వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/