Begin typing your search above and press return to search.

కరణ్ థాపర్ లాంటి దరిద్రపుగొట్టు పాత్రికేయులకు అబ్దుల్ కలాం ఎందుకు గుర్తుకు రారు?

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 AM GMT
కరణ్ థాపర్ లాంటి దరిద్రపుగొట్టు పాత్రికేయులకు అబ్దుల్ కలాం ఎందుకు గుర్తుకు రారు?
X
ముస్లింలు.. మైనార్టీల జీవితాలు దారుణంగా ఉన్నాయని నెత్తినోరు కొట్టుకునే కొందరు మేధావులు మన దేశంలో ఉన్నారు. అలాంటి వారంతా నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మైనార్టీలు ఇలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? అలాంటి వివక్షకు గురవుతున్నారు? లాంటి మాటల్ని చెప్పేస్తుంటారు. వారి మాటల్ని విన్నప్పుడు.. వారు ఉటంకించే గణాంకాల్ని చూసినంతనే నిజమే కదా? అన్న భావన చప్పున మదిలో మెదిలేలా చేస్తారు. ఎందుకిలా అంటే.. వివక్ష పేరుతో దేశంలో నిత్యం ఏదో ఒక అలజడిని క్రియేట్ చేయటమే పనిగా కొందరు పెట్టుకుంటారు. అలాంటి వారికి కరణ్ థాపర్ లాంటి 'నికార్సు' జర్నలిస్టులు కొందరు తమ మాటలతో పెట్రోల్ పోస్తేస్తుంటారు.

ఇలాంటి వారు వాస్తవాల్ని అస్సలు పట్టించుకోరు. కళ్ల ముందు కదిలే సత్యాల్ని వారు పరిగణలోకి తీసుకోరు. అక్కడెక్కడో అద్దాల మేడలో అది కూడా రూఫ్ టాప్ ఫ్లోర్ లో కూర్చొని కిందకు చూస్తారు. సహజంగానే అన్ని చిన్న చిన్నవిగా కనిపిస్తాయి. అలాంటి వారు తమ మనసుకు నచ్చిన వారితో మాట్లాడుతుంటారు. అలాంటి వారంతా ఒక మైండ్ సెట్ తో ఉండటం.. కొందరు ధైర్యం చేసి వాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తే వారిపై సంఘ్ పరివార్ అనో.. హిందుత్వ లాంటి తోకల్ని కట్టేస్తారు.

2014లో కానీ 2019లో కానీ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక్క ముస్లిం కూడా లోక్ సభకు ఎంపీగా ఎన్నిక కాలేదని చెబుతారు. 1998 నుంచి గుజరాత్ రాష్ట్రం తరఫున లోక్ సభకు కానీ.. విధాన సభకు కానీ ఒక్క ముస్లిం కూడా బీజేపీ పోటీలో నిలబెట్టలేదని ఆకార్ పటేల్ తన పుస్తకంలో రాసినట్లుగా కరణ్ థాపర్ కోట్ చేస్తారు. ఇలాంటి వారికి సమాధానం రెఢీగానే ఉంటుంది. కానీ.. వినే ఓపిక వారికి ఉందా? అన్నదే ప్రశ్న. ఎక్కడిదాకానో ఎందుకు.. హైదరాబాద్ లోక్ సభ స్థానం ఉంది. ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా మజ్లిస్ అభ్యర్థి అది కూడా ఓవైసీ కుటుంబం గుత్తాధిపత్యంలోనే ఉంది. మరి.. ఈ స్థానం నుంచి ఒక్క హిందువును మజ్లిస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎందుకు నిలపలేదు? ఓవైసీ లాంటి పోటు నేత.. మరో స్థానం నుంచి ఎందుకు పోటీ చేయరు.

అరేరె.. మజ్లిస్ లాంటి మంచి పార్టీ అధినేతకు కంచుకోట లాంటి సీటు నుంచి కూడా హిందువు అభ్యర్థిని నిలబెట్టాలా? నీ అత్యాశ మామూలుగా లేదుగా? అని అరవొచ్చు. సరే.. వారి వేదనను అర్థం చేసుకొని ఆ ఉదాహరణను వదిలేద్దాం. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ.. వారు ప్రాతినిధ్యం వహించే దాదాపు 40 మంది కార్పొరేటర్లలో.. పాతబస్తీ కోర్ నుంచి ఒక్కరంటే ఒక్క హిందువు ఎమ్మెల్యేను కానీ.. హిందువు ముస్లింను కానీ ఎందుకు బరిలోకి దించరు? ఆ పార్టీ తరఫున ఒక్కరంటే ఒక్క హిందూ ఎమ్మెల్యే ఎందుకు ఉండరు? ఒక్కసారైనా ఒక్క హిందువు ఎమ్మెల్సీకి అవకాశం ఎందుకు ఇవ్వరు?లాంటి ప్రశ్నలు వేస్తే.. సమాధానాలు చెప్పగలరా?

గుజరాత్ జనాబాలో 9 శాతం మంది ముస్లింలు ఉంటే.. గడిచిన 24 ఏళ్లుగా ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బీజేపీ అటు ఎంపీ కానీ ఎమ్మెల్యే సీటుకు కాని పోటీ నిలపలేదని గుండెలు బాదేసుకుంటారు. హైదరాబాద్ పాతబస్తీలో హిందువు జనాభా మహా అయితే 9 నుంచి 10 శాతానికి పైనే ఉండొచ్చు. మరి.. ఇదే లెక్క అక్కడ కూడా వర్తిస్తుంది కదా? మరి.. కరణ్ థాపర్ లాంటి పెద్ద మనషులు దీనికి ఏమని సమాధానం ఇస్తారు? మొత్తంగా చూస్తే.. హిందువులు.. హిందూ సమాజం లాంటి ఇరుకు మనస్త్త్తత్వం మరెక్కడా లేనట్లుగా చెబుతారు.

అదే నిజమైతే.. ఒక నికార్సు అయిన ముస్లిం అబ్దుల్ కలాం దేశ రాష్ట్రపతిగా మాత్రమే కాదు.. దేశ అంతరిక్ష ప్రయాణంలో ఆయన అలంకరించిన స్థానాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదే? ఆయన్ను వేలెత్తి చూపే ప్రయత్నం కూడా ఎవరు ఎందుకు చేయరు? ఇవాల్టికి కూడా నీ ఆదర్శ మూర్తుల పేర్లు చెబితే.. అబ్దుల్ కలాం ప్రాతినిధ్యం వహించే మతాన్ని పట్టించుకోకుండా ఆయన్ను తాము ప్రేమిస్తామని.. ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటామని కోట్లాది మంది భారతీయులు ఓటు వేస్తారు. మరెలా సాధ్యమైంది? అబ్దుల్ కలాం అన్నంతనే ఆయన్ను ముస్లింగా చూసి.. ఆయన్ను దూరంగా పెట్టాలి కదా? అందుకు భిన్నంగా గుండెల్లో ఎందుకు దాచుకున్నారు?

నిజానికి ఈ దేశానికి పట్టిన దరిద్రం ఓవైసీ లాంటి రాజకీయనాయకుల కంటే కూడా కరణ్ థాపర్ లాంటి వాళ్లే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే.. వారు తమ ఉనికిని చాటుకునేందుకు విషపూరిత ప్రచారాలు చేసి ప్రజల మనసుల్ని కలుషితం చేసే వారితోనే డేంజర్. వీరి కారణంగానే.. జహంగీర్ భాయ్.. కాజా భాయ్ లాంటి ఇరుగుపొరుగులోనూ అనుమానపు చూపులు రావటం.. దాంతో మిగిలిన వారు వేదన చెందటం ఈ మధ్యన ఎక్కువైంది. మేధావుల పేరుతో చలామణీ అవుతూ.. సెక్యులరిజం అంటూ సొల్లుమాటలు చెప్పి సమగ్రతను దెబ్బ తీసే ప్రచారాల్ని చేసే వారితోనే పెద్ద ముప్పు దాగి ఉంది. ఈ సత్యాన్ని అత్యధికులు తెలుసుకున్నంతనే కరణ్ థాపర్ లాంటి వారు గళం విప్పటానికి ఇష్టపడరు.