Begin typing your search above and press return to search.

విధేయుడితో అమ్మ మేనకోడలు

By:  Tupaki Desk   |   15 Feb 2017 5:03 AM GMT
విధేయుడితో అమ్మ మేనకోడలు
X
తమిళనాడు రాజకీయాల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. మరికొద్దిరోజుల్లో తన రాజకీయ రంగప్రవేశానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడించిన అమ్మ మేనకోడలు దీప.. తాజాగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. మంగళవారం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అమ్మ సమాధి వద్దకు వెళ్లిన దీప.. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో తన రాజకీయరంగ ప్రవేశాన్ని వెల్లడించారు.

చిన్నమ్మపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీరు శిబిరంలోకి తాను చేరుతున్నట్లుగా ఆమె వెల్లడించారు. తన రాజకీయ అరంగ్రేటంగా ప్రకటించారు. వాస్తవానికి అమ్మజన్మదినోత్సవం రోజున దీప తన రాజకీయ నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన నేపథ్యంలో దీప తన రాజకీయ రంగప్రవేశాన్ని పూర్తి చేశారు.

అమ్మ సమాధి వద్దకు దీప వెళ్లిన వేళలోనే.. పన్నీర్ సైతం అక్కడకు వచ్చారు. పన్నీర్ తో కలిసేందుకు వీలుగా ఆమెతన నిర్ణయాన్ని వెల్లడించారు. దీపను తమతో కలిసి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా పన్నీర్ సెల్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. అమ్మ మేనకోడలు దీప కొత్త పార్టీ పెడతారన్న అంచనాలు వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఆమె అమ్మకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వంతో కలవటం ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/