Begin typing your search above and press return to search.

ప్రఖ్యాత కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జగన్

By:  Tupaki Desk   |   7 July 2021 9:30 AM GMT
ప్రఖ్యాత కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జగన్
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు వినియోగించే వస్తువుల ఎంపిక చాలా లెక్కగా ఉంటుంది. ఉత్తినే వేటిని పడితే వాటిని వాడటం ఉండదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అధినేతలు ఏదైనా వస్తువుల్ని వాడటానికి ముందు.. నాణ్యతా పరమైన పరీక్షల్ని చేస్తారు. వాటిల్లో మెరుగైన ఫలితాలు వచ్చిన వాటిని మాత్రమే ముఖ్యమంత్రులు వాడేందుకు ఓకే చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫోటోల్ని వాడేటప్పుడు ఒక కంపెనీ లోగో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది.

సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సంబంధించిన ఏదైనా ఫోటో వాడే వేళ.. ఆయన రివ్యూ చేసే ఫోటోను వినియోగిస్తుంటారు. కుర్చీలో కూర్చొని ఉండే ఆయనకు ముందు కాన్ఫరెన్స్ సిస్టం సెటప్ ఉంటుంది. అత్యాధునికంగా ఉండే ఈ మైక్రోఫోన్ సెట్ ప్రఖ్యాత బోష్ కంపెనీకి చెందింది. నాణ్యత పరంగా తిరుగులేని ఈ కంపెనీకి సీఎం జగన్ వాడకం పుణ్యమా అని.. మరింత పేరు ప్రఖ్యాతులు సొంతమవుతున్నాయని చెప్పాలి.

ఈ కాన్ఫరెన్సు సిస్టం మీద కంపెనీ లోగో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉండటంతో సాదాసీదా ప్రజలకు సైతం ఈ బ్రాండ్ సుపరిచితమవుతోంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. ఖరీదైన బ్రాండ్ గా దీన్ని చెబుతారు. మొత్తంగా సీఎం జగన్ వినియోగిస్తుండటంతో బోష్ కంపెనీ ఉత్పత్తులకు మంచి ప్రచారం లభించినట్లుగా మారిందని చెప్పక తప్పదు.