Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. నారా లోకేష్ స‌టైర్లు విన్నారా?

By:  Tupaki Desk   |   28 Dec 2022 9:30 AM GMT
జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. నారా లోకేష్ స‌టైర్లు విన్నారా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాజాగా ఢిల్లీకి వెళ్లారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని ఆయ‌న క‌లుసుకున్నారు. ఈ రోజు రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతోనూ భేటీ కానున్నారు. ఈ మ‌ధ్య‌లో కుదిరితే.. మ‌రో న‌లుగురు కేంద్ర మంత్రుల‌తోనూ ఆయ‌న స‌మావేశం కానున్నారు. అయితే.. జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స‌టైర్ల‌పై స‌టైర్లు వేశారు.

ఏ1 జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటన ఎందుకని నారా లోకేష్‌ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. బాబాయ్ ని లేపేసిన తమ్ముడిని కాపాడుకోవడానికా?

లేక ఢిల్లీ లిక్కర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ ఏ2 ఫ్యామిలీని రక్షించడానికా అని ప్రశ్నించారు. అప్పులు చేయడానికి అనుమతి కోసమా అని ఎద్దేవా చేశారు.

సీఎం రాష్ట్ర అవసరాల కోసం ఢిల్లీ వెళ్లలేదనీ.. తన తమ్ముడిపై ఉన్న కేసునో.. లేదా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏ2గా ఉన్న తన కుటుంబసభ్యులను తప్పించడం కోసమో వెళ్లారంటూ విమర్శించారు. లేదా అప్పులు చేయడానికి అనుమతి కోసమైనా అయి ఉంటుందని ఎద్దేవా చేశారు. నిజానికి సీఎం జ‌గ‌న్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. గ‌తంలో అప్పుల కోసం ఆయ‌న వెళ్తున్నార‌నే ప్ర‌చారం ఉండేది.

కానీ, ఇటీవ‌ల వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి పేరు రావ‌డం.. ఆ వెంట‌నే డాక్ట‌ర్ సునీత‌(వివేకా కుమార్తె) అవినాష్ విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌డం.. అయితే.. అవినాష్ నే జ‌గ‌న్ వెనుకేసుకురావ‌డం తెలిసిందే.

ఇటీవ‌ల రెండు రోజుల కింద‌ట కూడా.. అవినాష్ త‌న త‌మ్ముడే అంటూ.. జ‌గ‌న్ వ్యాఖ్యానించిన వీడియో వైర‌ల్ అయింది. ఈ నేప‌థ్యంలో నారా లోకేష్ తాజా ప‌ర్య‌ట‌న‌పై స‌టైర్లు గుప్పించ‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.