Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఆమాత్రం బాధ్య‌త లేదా?

By:  Tupaki Desk   |   30 Aug 2021 3:30 PM GMT
వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఆమాత్రం బాధ్య‌త లేదా?
X
ఔను! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది ప్ర‌కాశం జిల్లాలో. ఈ జిల్లా కు వ‌ర‌ప్ర‌దాయిని వంటి.. పూల‌సుబ్బ‌య్య వెలిగొండ ప్రాజెక్టు విష‌యంలో తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ ఘ‌ర్ష‌ణ జ‌రుగుతోంది. వాస్త‌వానికి ఇది 1996లోనే జీ వం పోసుకుంది. అయితే.. అప్ప‌టి నుంచి రాజ‌కీయ గ్ర‌హ‌ణాల‌తో ఈ ప్రాజెక్టు ముందుకు సాగ‌లేదు. అయి తే.. కొన్ని ప్ర‌య‌త్నాల త‌ర్వాత‌.. ఈ ప్రాజెక్టు.. తుదిద‌శ‌కు చేరుకుంది. రేపో మాపో.. దీనిని ప్రారంభించేం దుకు వైసీపీ ప్ర‌భుత్వం కూడా స‌మాయ‌త్మైంది.

అయితే.. ఇంత‌లోనే ఈ ప్రాజెక్టుకు నీటిని ఇవ్వొద్ద‌ని, నిధులు కూడా ఇవ్వ‌ద్ద‌ని పేర్కొంటూ.. తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అదేస‌మ‌యంలో కేఆర్ ఎంబీకి కూడా ఫిర్యాదు చేసింది. ఇది అక్ర‌మ ప్రాజెక్టు అని తేల్చింది. ఈ ప‌రిణామానికి తోడు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ఏడు ప్రాజెక్టుల్లో వెలిగొండ ప్రాజెక్టు ఉన్న‌ప్ప‌టికీ.. దీనిని కేంద్ర ప్ర‌భుత్వం గెజిట్‌లో చేర్చ‌క‌పోవ‌డం.. తెలంగాణ ప్ర‌భుత్వానికి క‌లిసి వ‌చ్చింది. దీంతో వెంట‌నే ఈ ప్రాజెక్టును నిలిపివేశేలా ఆదేశించాల‌ని కోరుతూ..కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే తెలంగాణ ప్ర‌భుత్వానికి టీడీపీ ప్ర‌కాశం జిల్లా ఎమ్మెల్యేలు.. న‌లు గురు.. లేఖ రాశారు. ఇది త‌గ‌ద‌ని.. పేర్కొన్నారు. జిల్లాలో నీటి ఎద్ద‌డి కార‌ణంగా..ఇక్క‌డి ప్ర‌జ‌లు నానా తి ప్పులు ప‌డుతున్నార‌ని.. ఇప్పుడు వెలిగొండ కూడా ఆగిపోతే. త‌మ‌కు తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని వారు పేర్కొన్నా రు. త‌మ జిల్లాను ఇబ్బంది పెట్టొద్ద‌ని వారు సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేర‌కు అన్నివివ‌రాల‌తో కేసీఆర్‌కు లేఖ‌ను పంపారు. మ‌రి ప్ర‌తిప‌క్ష నేత‌లుగా వారు చేసిన ప‌నిలో పావ‌లా వంతైనా.. వైసీపీ నేత‌ల‌కు బాధ్య‌త లేదా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌.

గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లాలో 4 స్థానాలు మిన‌హా..అ న్నీ.. వైసీపీకి అప్ప‌గించారు ఇక్క‌డి ప్ర‌జ‌లు. ఇక‌, ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా వెలిగొండ కోసం.. నాటి ఒంగోలు ఎంపీగా.. వైవీ సుబ్బారెడ్డి(ప్ర‌స్తుత టీటీడీ చైర్మ‌న్‌) పాద‌యాత్ర కూడా చేశారు. మ‌రి ఇప్పుడు ఏమ‌య్యారు? అధికార పార్టీ ఎంపీలు , ఎమ్మెల్యేలు ఇక్క‌డ వారి గురించి ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు? వీరంతా నిద్ర పోతున్నారా? లేక కేసీఆర్ అంటే.. భ‌య‌ప‌డుతున్నారా? క‌నీసం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఉన్న‌పాటి బాధ్య‌త వైసీపీ నేత‌లుగా.. ప్ర‌జ‌లు ఓట్లేశార‌నే విజ్ఞ‌త కూడా చూపించ‌లేక పోతున్నారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. మ‌రి దీనికి వారు ఎలాంటి ఆన్స‌ర్ ఇస్తారో చూడాలి.