Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు పై..రివ్యూ ఉంటుందా? ఉండదా?

By:  Tupaki Desk   |   10 Nov 2019 3:09 PM IST
అయోధ్య తీర్పు పై..రివ్యూ ఉంటుందా? ఉండదా?
X
అయోధ్య తీర్పు రానే వచ్చింది. ఈ తీర్పు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇచ్చింది. దీంతో ఇదే దాదాపు అంతిమ తీర్పు అనే అనుకోవాలి. ఇది వరకూ అయోధ్యపై తొమ్మిదేళ్ల కిందటే హై కోర్టు తీర్పు వచ్చింది. అప్పుడు వచ్చిన తీర్పకు భిన్నంగా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చింది.

అయితే ఈ వ్యవహారంపై ఇంకా న్యాయపరమైన పోరాటానికి ఆస్కారం కొంత వరకూ ఉందని స్పష్టం అవుతోంది. అదే రివ్యూ పిటిషన్. ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిందిగా ఒక పిటిషన్ దాఖలు చేయవచ్చని న్యాయనిపుణులు అంటున్నాయి.

అయోధ్య పిటిషనర్లలో హిందూవాదులు తీర్పు పట్ల సంతోషంగా ఉన్నారు. వారు కోరుకున్నది జరిగింది. కాబట్టి వారు రివ్యూ పిటిషన్ దాఖలు చేయరని స్పష్టం అవుతోంది. ఇక ముస్లిం వైపు పిటిషన్లు దాఖలు చేసిన వారు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది. వారిలో కొందరు వచ్చిన తీర్పుతో సంతోషంగా ఉన్నామని అంటున్నారు. ఇన్నేళ్ల న్యాయపరమైన పోరాటాన్ని ఆపేయనున్నట్టుగా ప్రకటించారు. మరి కొందరు మాత్రం ఇంకా తాము తీర్పును సమీక్షించుకోవాల్సిందిగా ప్రకటించారు. ఒకరు మాత్రం రివ్యూ దాఖలు చేయబోతున్నట్టుగా పేర్కొన్నారు.

ముస్లింల తరఫున కూడా పలువురు పిటిషనర్లున్నారు. వారు అలా భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఇక చాలన్నట్టుగా వ్యవహరిస్తుంటే, ఇంకొందరు మాత్రం మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ రివ్యూ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు తీసుకుంటుందా? ధర్మాసనం తీర్పును స్టే ఇస్తుందా? అనేది మాత్రం ఇప్పుడప్పుడేతేలే అంశం కాకపోవచ్చు. అంత వరకూ ధర్మాసనం ఇచ్చే తీర్పే ఫైనల్ అనేది మాత్రం ఖాయమే అని విశ్లేషకులు అంటున్నారు.