Begin typing your search above and press return to search.

బాలయ్యా.. జర ఇటు రావయ్యా?

By:  Tupaki Desk   |   27 Aug 2019 6:50 AM GMT
బాలయ్యా.. జర ఇటు రావయ్యా?
X
2014 ఎన్నికలు టీడీపీకి పీడకలను మిగిల్చాయి. కేవలం 23మందికే పరిమతమయ్యారు. రాయలసీమలో అయితే గెలిచిందే ముగ్గురు.. చంద్రబాబు - పయ్యావుల కేశవ్ - బాలక్రిష్ణ. ఈ ముగ్గురిలో ఇద్దరు యాక్టివ్ గా ఉన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తమ తమ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకుంటున్నారు. చంద్రబాబు కుప్పం కంచుకోట కావడంతో ఫర్వాలేదు. ఇక గతసారి ఓడిన పయ్యావుల.. ఈసారి తన నియోజకవర్గంలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ బలాన్ని పెంపొందించుకుంటున్నారు.

ఇక హిందూపురంలో మాత్రం పరిస్థితి రివర్స్ గా ఉంది. బాలయ్య హైదరాబాద్ లోనే ఉండి పీఏలతో పాలన సాగిస్తున్నారట.. కేఎస్ రవికుమార్ తో కొత్త సినిమా కోసం బాలయ్య సన్నబడి యంగ్ లుక్ లో మంచి ఫ్రెంచ్ కట్ గడ్డంతో సినిమా షూటింగ్ లతో బిజీబిజీగా ఉన్నారు. బాలయ్య కొత్తలుక్ ఇటు ఇండస్ట్రీని - అటు రాజకీయాల్లో సంచలనమైంది.. అయితే హిందుపురంలో మాత్రం మా ఎమ్మెల్యే ఏడీ అంటూ అప్పుడే నిరసనలు వెల్లువెత్తుతున్నాయట..

ఇక బాలయ్య సినిమాలతో బిజీగా ఉండడం.. వరుసగా సినిమాలు చేసుకుంటూ హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ఈ అవకాశాన్ని వైసీపీ వాడుకుంటోంది. తాజాగా హిందుపురంలో బాలయ్య చేతిలో ఓడిన ఇక్బాల్ కు జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాడు. ఇప్పుడు హిందూపురంలో ఈయనే అనధికార ఎమ్మెల్యేగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజాసమస్యలు తీరుస్తూ బాలయ్య లేని లోటును పూడ్చివేస్తున్నారట.. 2024లో బాలయ్యను ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారట..

హిందుపురం నందమూరి ఫ్యామిలీకి కంచుకోట.. అలాంటి చోట ఓటమి ఎరుగని బాలయ్యకు వచ్చే ఎన్నికల్లో ఓడించేలా వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ పావులు కదుతున్నారు. ఈ పరిణామం గురించి పెద్దగా పట్టించుకోని బాలయ్య మాత్రం సినిమాలతో బిజీగా ఉండడం విశేషం.