Begin typing your search above and press return to search.

స్వాతి మాట‌: ఎవ‌డు ప్లాన్ అత‌డిదేన‌ట‌

By:  Tupaki Desk   |   24 Dec 2017 9:08 AM GMT
స్వాతి మాట‌: ఎవ‌డు ప్లాన్ అత‌డిదేన‌ట‌
X
రెండు తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశ వ్యాప్తంగానూ సంచ‌ల‌నం సృష్టించింది ఎవ‌డు మ‌ర్డ‌ర్ కేసు. చివ‌ర‌కు ఈ క్రైం స్టోరీ అంత‌ర్జాతీయ మీడియాలోనూ ప‌బ్లిష్ అయ్యింది. తెలుగులో హిట్ అయిన మూవీని స్ఫూర్తిగా తీసుకొని.. అక్ర‌మ సంబంధం మోజులో ప‌డి క‌ట్టుకున్న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి పాశ‌వికంగా చంపిన ఈ ఉదంతం రేపిన క‌ల‌క‌లం అంతాఇంతా కాదు.

చ‌క్క‌టి భ‌ర్త‌.. సంపాద‌న‌కు.. సంప‌ద‌కు లోటు లేకున్నా.. కేవ‌లం ప‌రాయివ్య‌క్తి మోజులో ప‌డి ఏకంగా భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టేందుకు చేసిన ప్ర‌య‌త్నం కోట్లాది మంది నోట మాట రాకుండా చేయ‌ట‌మే కాదు.. ఎక్క‌డికి వెళుతున్నాం.. ఏమై పోతున్నామ‌న్న భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా చేసింది.

ప్రియుడు రాజేశ్ మోజులో ప‌డి భ‌ర్త‌ను చంపేసిన స్వాతి.. ఆ త‌ర్వాత ప్రియుడి ముఖానికి గుడ్డ క‌ట్టేసి పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని.. ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ద్వారా భ‌ర్త స్థానంలోకి ప్రియుడ్ని తీసుకురావాల‌న్న ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. వారి ప్లాన్ వ‌ర్క్ వుట్ కాక‌పోవ‌టం.. పోలీసుల ఎంట్రీతో వారి దుర్మార్గం బ‌య‌ట‌ప‌డింది.

దీంతో.. స్వాతిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ కు త‌ర‌లించారు. ఇక‌.. రాజేశ్‌ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కే పాపం తెలీద‌ని.. భ‌ర్త‌ను మ‌ర్డ‌ర్ చేసే ప్లాన్ అంతా ఆమెదేన‌ని పోలీసుల‌కు చెప్పాడు. తాజాగా కోర్టు అనుమ‌తితో ఆమెను విచారించారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల ఎదుట భోరుమంది స్వాతి. రాజేశ్ మైకంలో ప‌డి తాను త‌న భ‌ర్త‌ను చంపుకున్నాన‌ని.. రాజేశ్ చెప్పిన‌ట్లు చేశాన‌ని. అంతా సినిమాలో మాదిరి జ‌రుగుతుంద‌ని చెబితే న‌మ్మాన‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

ఇదంతా విన్న‌ప్పుడు అయ్యో.. అలా జ‌రిగిందా? అన్న భావ‌న కొంద‌రికి క‌ల‌గొచ్చు. ఇప్పుడు చెప్పే విష‌యం తెలిస్తే మ‌రింత షాక్‌ కు గురి కావ‌టం ఖాయం. అదేమంటే.. భ‌ర్త‌ను చంపే క్ర‌మంలో ఇనుప రాడ్‌ తో బ‌లంగా నెత్తి మీద కొట్టిన‌ప్పుడు వ‌చ్చిన ర‌క్తాన్ని తుడిచేందుకు ఉప‌యోగించిన వ‌స్త్రం గురించి అడిగిన‌ప్పుడు.. ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన దానిని చూపించింది.

ఈ వ‌స్త్రాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్వాతిని తీసుకొని ఆమె ఇంటికి వెళ్లారు. అక్క‌డ బీరువా తెరిపించి.. అందులో దాచిన వ‌స్త్రాన్ని తీసుకొని కోర్టుకు అందించారు. మొద‌ట్లో హ‌త్య చేసిన‌ప్పుడు వేసుకున్న దుస్తుల్ని ఏం చేశార‌న్న‌ప్పుడు స్పష్ట‌మైన స‌మాచారం ఇవ్వ‌లేద‌ని.. తాజాగా చేసిన విచార‌ణ సంద‌ర్భంగా వివ‌రాల్ని వెల్ల‌డించ‌ట‌మే కాదు.. సాక్ష్యాల్ని త‌న‌కు తాను అందించింది స్వాతి. మ‌ళ్లీ ఆమెను మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జైలుకు త‌ర‌లించారు.. ఈ ఎపిసోడ్ ను చూసిన‌ప్పుడు తొలుత రాజేశ్‌ ను విచారించిన సంద‌ర్భంలో అంతా స్వాతి చెప్పినట్లే తాను చేశాన‌ని.. హ‌త్య ప్లాన్ అంతా ఆమెదేన‌ని చెప్ప‌టం కనిపిస్తుంది. తాజాగా.. స్వాతిని విచారించిన‌ప్పుడు.. అంతా రాజేశ్ చెప్పిన‌ట్లే తాను చేసిన‌ట్లు చెప్ప‌టం క‌నిపిస్తుంది. మ‌ధ్య‌లో వ‌చ్చే బంధాలు.. ఆక‌ర్ష‌ణ‌లు అన్ని తాత్కాలిక‌మే త‌ప్పించి.. అందులో మ‌రింకేమీ ఉండ‌ద‌న్న నిజం తాజా ఎపిసోడ్ చూస్తే అర్థం కాక మాన‌దు.