Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగోడ్ని అన్యాయంగా చంపేశారు

By:  Tupaki Desk   |   7 April 2015 10:44 PM IST
అమెరికాలో తెలుగోడ్ని అన్యాయంగా చంపేశారు
X
అమెరికాలో తెలుగువ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఏపీలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన మాదాల రాజేష్‌ ఎమ్మెస్సీ కంఫ్యూటర్స్‌ చేసి అమెరికాకు వెళ్లాడు.

అతడు గ్యాస్‌ కంపెనీ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అతని వద్దకు వచ్చిన ఒక నల్లజాతీయుడు డబ్బు కోసం బెదిరించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని చెబుతున్నారు.

ఈ సమయంలో నల్లజాతీయుడు తుపాకీతో రాజేష్‌ను కాల్చి చంపినట్లు చెబుతున్నారు. అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని పియోరియో ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజేష్‌ మృతి చెందిన వార్తను గ్యాస్‌ స్టేషన్‌ యజమాని.. మృతుడి భార్యకు ఫోన్లో వెల్లడించారని చెబుతున్నారు.