Begin typing your search above and press return to search.

రోడ్డు పక్కన చిప్స్‌ అమ్ముతున్న ఇండియా పారా షూటర్‌ .. ఏం జరిగిందంటే ?

By:  Tupaki Desk   |   23 Jun 2021 11:48 AM GMT
రోడ్డు పక్కన చిప్స్‌ అమ్ముతున్న ఇండియా పారా షూటర్‌ .. ఏం జరిగిందంటే ?
X
ఆ మహిళ గతంలో ఇంటర్నేషనల్ స్టేజ్స్ పై మన దేశ జాతీయ పతకాన్ని సగర్వంగా ఎగిరేలా చేసింది. ఇండియా నుండి తోలి ఇంటర్నేషనల్ పారా షూటర్లలో ఒకరు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పదుల సంఖ్యలో పతకాలు సాధించారు. కానీ, ప్రస్తుతం ఆమె కటిక పేదరికం అనుభవిస్తూ, సాయం కోసం ఎదురు చూస్తుంటే ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఇలాంటి కష్ట కాలంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన ఓ చిన్న బండి మీద చిప్స్‌, బిస్కట్‌ ప్యాకెట్‌ లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు దిల్‌రాజ్‌ కౌర్‌.

వివరాల్లోకి వెళ్తే .. ఉ‍త్తరాఖండ్‌ కు చెందిన దిల్‌ రాజ్‌ కౌర్‌ ఇండియా మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2005లో ఈ రంగంలో ప్రవేశించిన ఆమె 2015 వరకు విజయవంతంగా కొనసాగారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రెండు డజన్లకు పైగా పతకాలు సాధించారు. అయితే, ఆ పతకాలు ఆమె కష్టాలు తీర్చలేదు. ప్రభుత్వం ఆమెను పట్టించుకోలేదు. ఆర్థిక సాయం కానీ, ఉద్యోగం ఇవ్వడం కానీ చేయలేదు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్డు పక్కన బండి పెట్టుకుని చిప్స్‌, బిస్కెట్‌ ప్యాకెట్స్‌ అమ్ముతున్నారు. ఒకప్పుడు దేశంలోనే గొప్ప పారా ఎయిర్‌ పిస్టల్‌ షూటర్‌గా నిలిచిన ఆమె ప్రస్తుతం ఇంత దీన స్థితిలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా దిల్‌ రాజ్‌ కౌర్‌ మాట్లాడుతూ..దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను ముందుకు వచ్చాను. ఎన్నో పతకాలు సాధించాను. కానీ నాకు అవసరం ఉన్నప్పుడు ఎవరు సాయం చేయడానికి ముందుకురాలేదు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం, మద్దతు లభించలేదు. నా విజయాల ఆధారంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగానికి అప్లై చేశాను. కానీ, ప్రతిసారి తిరస్కరించారు. ప్రస్తుతం నేను మా అమ్మతో కలిసి ఓ అపార్ట్‌ మెంట్‌ లో రెంట్‌ కు ఉంటున్నాను. ప్రస్తుతం మా ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. అద్దె కట్టడం, మిగతా ఖర్చుల కోసం ఇలా రోడ్డు పక్కన చిప్స్‌, బిస్కెట్లు అమ్ముకుంటున్నట్టు తెలిపారు.