Begin typing your search above and press return to search.
ఫ్లైట్ లో భారత్ మీదుగా వెళ్లకూడదని డిసైడ్ అయిన ఇమ్రాన్
By: Tupaki Desk | 3 Feb 2020 10:14 AM ISTపాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా మలేషియా లో పర్యటించనున్నారు. భారత్ మీదుగా ప్రయాణించాల్సిన ఇమ్రాన్ విమానం.. తాజాగా భారత్ మీదుగా వెళ్లకూడదని నిర్ణయించారు. పుల్వామా దాడి.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడుల నేపథ్యంలో పాక్ గగనతలం మీదుగా భారత్ విమానాల రాకపోకల్ని సాగించకుండా నిషేధాన్ని విధించటం తెలిసిందే.
తర్వాతి కాలంలో రాష్ట్రపతి కోవింద్.. భారత ప్రధాని మోడీలు తమ విదేశీ పర్యటనల్లో భాగంగా పాక్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ.. పాక్ నిషేధం నేపథ్యంలో వేరే మార్గం గుండా ప్రయాణించారు. దాయాది తీరును అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు భారత్ కంప్లైంట్ చేసింది కూడా.
ఇదిలా ఉంటే ఈ రోజు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మలేషియాలో పర్యటించనున్నారు. తన పర్యటన లో భాగంగా భారత గగనతలం మీదుగా ఆయన మలేషియా వెళ్లాల్సి ఉంది. తాను నిషేధం విధించిన నేపథ్యం లో భారత్ మీదుగా ప్రధాని ఇమ్రాన్ ప్రయాణించే ఫ్లైట్ వెళ్లకుండా పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. అవసరం లేని నిషేధాలు విధించి.. తిప్పలు పడటం అంటే ఇదేనేమో?
తర్వాతి కాలంలో రాష్ట్రపతి కోవింద్.. భారత ప్రధాని మోడీలు తమ విదేశీ పర్యటనల్లో భాగంగా పాక్ గగనతలం మీదుగా ప్రయాణించాల్సి ఉన్నప్పటికీ.. పాక్ నిషేధం నేపథ్యంలో వేరే మార్గం గుండా ప్రయాణించారు. దాయాది తీరును అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థకు భారత్ కంప్లైంట్ చేసింది కూడా.
ఇదిలా ఉంటే ఈ రోజు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. మలేషియాలో పర్యటించనున్నారు. తన పర్యటన లో భాగంగా భారత గగనతలం మీదుగా ఆయన మలేషియా వెళ్లాల్సి ఉంది. తాను నిషేధం విధించిన నేపథ్యం లో భారత్ మీదుగా ప్రధాని ఇమ్రాన్ ప్రయాణించే ఫ్లైట్ వెళ్లకుండా పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. అవసరం లేని నిషేధాలు విధించి.. తిప్పలు పడటం అంటే ఇదేనేమో?
