Begin typing your search above and press return to search.

హైదరాబాద్​ టెకీ.. న్యూయార్క్​ లో మృతి

By:  Tupaki Desk   |   3 Dec 2020 12:50 PM GMT
హైదరాబాద్​ టెకీ.. న్యూయార్క్​ లో మృతి
X
హైదరాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ న్యూయార్క్​లో కన్నుమూశారు. బోడుప్పల్​కు చెందిన శ్రీధర్​ పానుగంటి.. టెక్​ మహీంద్రా (అమెరికా)లో ఉద్యోగం చేస్తున్నారు. న్యూయార్క్​ బఫెలోలోని స్లేట్ క్రీక్ డ్రైవ్‌లోని ఓ ఆపార్ట్​మెంట్​లో ఉంటున్నారు. అయితే శ్రీధర్​ భార్య ఝాన్సీ రాణి, కుమారుడు (5) గత జవవరిలో ఇండియాకు వచ్చారు. కరోనా లాక్​డౌన్​తో ఇండియాలోనే ఉండిపోయారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీధర్​ ఇండియాకు వచ్చి భార్యపిల్లలను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే శ్రీధర్​ మృతిచెందారు. అయితే అతడు ఎలా మృతిచెందాడన్న విషయంపై క్లారిటీ లేదు. నవంబర్ 27 నుంచి శ్రీధర్​ ఫోన్​ తీయడం లేదు. అతడి స్నేహితులకు, కొలిగ్స్​కు ఫోన్​చేసిన తెలియదని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన శ్రీధర్​ తల్లిదండ్రులు, అతడి భార్య అమెరికాలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు న్యూయార్క్​లోని శ్రీధర్​ ఇంటిని తనిఖీ చేయగా .. విషయం బయటపడింది. నవంబర్​ 27న రాత్రి అతడు చనిపోయినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఎలా చనిపోయాడన్న విషయం ఇంకా తెలియదు. విచారణ కొనసాగుతున్నది. శ్రీధర్​ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేలా చూడాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. ఈ విషయంపై భారతవిదేశాంగశాఖ.. న్యూయార్క్​లోని భారత కాన్సలేట్​ జనరల్​కు లేఖ రాసింది.