Begin typing your search above and press return to search.

కరోనా బారిన పడిన భర్తను వదిలి షాపు కుర్రాడితో వెళ్లింది..కట్ చేస్తే

By:  Tupaki Desk   |   27 Aug 2021 7:30 AM GMT
కరోనా బారిన పడిన భర్తను వదిలి షాపు కుర్రాడితో వెళ్లింది..కట్ చేస్తే
X
పెళ్లై.. పిల్లలు ఉన్న వేళ.. సంసారాన్ని వదిలేసి.. ఆకర్షణ దిశగా అడుగులు వేసే ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అయ్యాయి. వీటిల్లో చాలావరకు క్రైం వైపునకు అడుగులు వేస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన భర్తను వదిలేసి.. తాత్కాలిక సుఖం కోసం ఆమె చేసిన ప్రయత్నం చివరకు ఆమె జీవితాన్ని అంతం చేసేలా చేసింది. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

హోసూరు ఎంజీ రోడ్డుకు చెందిన 28 ఏళ్ల జ్యోతిష్ బైక్ మెకానిక్ షాపు యజమాని. ఏడేళ్ల క్రితం బెంగళూరకు సమీపంలోని వందన (25)తో పెళ్లైంది. వారికి ఒక బాబు ఉన్నాడు. వాడికి ఆరేళ్లు. హాయిగా సాగుతున్న వారి సంసారంలో కరోనా ఎంట్రీ కొత్త దారికి వెళ్లేలా చేసింది. భర్తకు కరోనా సోకిన వేళ.. భర్త షాపులో పని చేసే సుగిల్ అనే పాతికేళ్ల యువకునికి చేరువైంది.

ఇది ఆమె సంసారంలో చిచ్చు రేపింది. భార్య తీరును గట్టిగా ప్రశ్నించిన భర్త తీరుతో ఆమె చెప్పాపెట్టకుండా సుగిల్ లో వెళ్లిపోయింది. దీంతో.. ఆమె కోసం వెతికిన జ్యోతిష్ ఆమెను వెతికి ఇంటికి తీసుకొచ్చారు. ఇరువురి మద్య మొదలైన వాదులాట గొడవగా మారింది. దీంతో ఆవేశానికి గురైన జ్యోతిష్ భార్య గొంతు కోసి చంపేశాడు. దీంతో..జ్యోతిష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి.. రిమాండ్ కు తరలించారు. దేనికో మొదలైన వ్యవహారం మరేదోగా మారిన వైనం అయ్యో అనిపించక మానదు.