Begin typing your search above and press return to search.

కాసేపట్లో కుమార్తె పెళ్లి.. అంతలో భార్యను చంపి.. భర్త సూసైడ్

By:  Tupaki Desk   |   27 Aug 2021 9:30 AM GMT
కాసేపట్లో కుమార్తె పెళ్లి.. అంతలో భార్యను చంపి.. భర్త సూసైడ్
X
అనూహ్యమైన పరిణామాలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు చేసుకుంటున్నారో? కారణం ఏమిటో? అస్సలు అర్థం కానట్లుగా పరిస్థితులు ఉంటున్నాయి. తాజాగా విశాఖలోని మద్దులపాలెంలో చోటు చేసుకున్న షాకింగ్ విషాదం చూస్తే.. నోట మాట రాని పరిస్థితి. కలలో కూడా ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామం చూస్తే.. అయ్యో అనుకోకుండా ఉండలేం.

కాసేపట్లో కల్యాణ మండపంలో కుమార్తె పెళ్లి పెట్టుకొన్న వేళ.. భార్యతో జరిగిన చిన్న వాదులాతోవిసిగిపోయిన భర్త.. భార్యను చంపేసి.. తాను సూసైడ్ చేసుకున్నవైనం షాకింగ్ గా మారింది. కాసేపట్లో కుమార్తె పెళ్లి అన్న వేళలో.. హడావుడిగా భార్యభర్తలు కల్యాణ మండపాన్ని వీడటం.. కాసేపట్లోనే వారిద్దరూ మరణించి ఉండటం అందరిని కదిలిపోయేలా చేసింది.

ఇంతకూ అసలేం జరిగిందన్న విషయానికి వస్తే.. పోలీసుల అంచనా ప్రకారం.. విశాఖ పోర్టు రిటైర్డు ఉద్యోగి జగన్నాథరావు (63).. విజయలక్ష్మీ (57) ఇరువురు దంపతులు. వారి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. కల్యాణ మండపంలో పెళ్లి వేడుక జరుగుతున్న వేళలో.. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు హడావుడిగా బయటకు వెళ్లారు. ఆ తర్వాత నుంచి వారు ఎవరికి అందుబాటులోకి రాలేదు. కన్యాదానం చేయాల్సిన సమయం రావటం.. తల్లిదండ్రులు కనిపించకుండా పోవటంతో కుటుంబ సభ్యులకు అస్సలు అర్థం కాలేదు.

చివరకు వారు ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్న వైనం షాక్ కు గురి చేసింది. పోలీసు వర్గాలు అందిస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం.. పెళ్లి కుమార్తె తల్లి విజయలక్ష్మి గత కొంతకాలంగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో.. ఆమె తరచూ ఇరుగుపొరుగు వారితో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. పెళ్లి రోజున కూడా భర్తతో ఆమె గొడవ పడినట్లు భావిస్తున్నారు. భార్య ప్రవర్తనకు విసుగు చెందిన భర్త.. ఆమెను ఇంటికి తీసుకెళ్లి చంపేసి.. తాను ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కాసేపట్లో పెళ్లి వేడుక ముగిసి.. సంతోషంతో ఉండాల్సిన ఇల్లు.. ఇప్పుడు విషాదానికి నిలయంగా మారింది.