Begin typing your search above and press return to search.

ఢిల్లీలో తెలుగున‌టుల హ‌ల్చ‌ల్..మోహ‌న్ బాబు, ప‌వ‌న్, అలీ!

By:  Tupaki Desk   |   30 Jan 2020 1:30 AM GMT
ఢిల్లీలో తెలుగున‌టుల హ‌ల్చ‌ల్..మోహ‌న్ బాబు, ప‌వ‌న్, అలీ!
X
ఢిల్లీలో తెలుగు న‌టులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రిగా హల్చ‌ల్ చేస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక్కొక్క‌రు ఢిల్లీకి వెళ్ల‌డం బీజేపీ ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం కావ‌డం, ఫొటోలు దిగ‌డం జ‌రుగుతూ ఉంది. వీరిలో కొంద‌రిది రాజ‌కీయం, మ‌రి కొంద‌రిది రాజ‌కీయం అనే అనుమానం!

ముందుగా మోహ‌న్ బాబు వెళ్లి మోడీ తో ఫొటోలు దిగివ‌చ్చారు. మోహ‌న్ బాబు వెంట ఆయ‌న కుమారుడు, కుమార్తె, కోడ‌లు, మ‌న‌వ‌ళ్లు-మ‌న‌వ‌రాళ్లు ఉన్నారు. మోడీతో గ‌తం నుంచి మోహ‌న్ బాబుకు సాన్నిహిత్యం ఉండింది. చాలా రోజుల త‌ర్వాత అలా మోహ‌న్ బాబు వెళ్లి మోడీని కలిసి వ‌చ్చారు.

ఇక మోడీ ద‌ర్శ‌నం దొర‌క్క‌పోయినా.. ఢిల్లీలో మాత్రం హ‌ల్చ‌ల్ చేశాడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తో ఆయ‌న స‌మావేశం అయ్యారు. బీజేపీతో పొత్తు కోసం ప‌వ‌న్ వెళ్లారు. అది ప్ర‌క‌టించేశారు కూడా.

ఇక ఇటీవ‌లే ఢిల్లీలో భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యం వ‌ద్ద అలీ క‌నిపించ‌డం వార్త‌ల్లోకి వ‌చ్చింది. అలీ బీజేపీలో చేరే ఉద్ధేశంతో ఉన్నార‌ని, అందుకే ఆయ‌న ఢిల్లీ వెళ్లి క‌మలం పార్టీ ఆఫీసుకు వెళ్లిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటిదేమీ లేద‌ని అలీ క్లారిటీ ఇచ్చారు. ఇందులో కూడా రాజ‌కీయం ఏమీ లేద‌ని అలీ అండ్ కో చెబుతోంది. ప్ర‌స్తుతం అలీ ఒక హాలీవుడ్ సినిమాలో న‌టిస్తున్నాడ‌ట‌. ఇప్ప‌టికే అలీ అడ‌పా దడ‌పా బాలీవుడ్ సినిమాల్లో క‌నిపించారు. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా త‌న ఎంట్రీని ఇవ్వ‌నున్నార‌ట‌. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ఇండియా లోనే సాగుతుంద‌ని స‌మాచారం. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ‌ కు సంబంధించి ప‌ర్మిషన్ల కోసం అలీనే చొర‌వ చూపుతున్నార‌ట‌.

అందులో భాగంగానే ఆయ‌న కేంద్ర‌మంత్రిని, అంతకు ముందు బీజేపీ పెద్ద‌ల‌త‌ను క‌లిసిన‌ట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వ్య‌వ‌హారాలు ఏమున్నా.. తెలుగు సినిమా న‌టులు ఢిల్లీలోని బీజేపీ వాళ్ల‌తో బాగా క‌నిపిస్తూ ఉన్నారు. మొద‌ట మోహ‌న్ బాబు ఆ తర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్, ఇప్పుడు అలీ.. ఢిల్లీ వార్త‌ల్లో నిలుస్తున్నారు!