Begin typing your search above and press return to search.

రోహిత్​పై వేటు తప్పదా?

By:  Tupaki Desk   |   21 April 2021 10:30 AM GMT
రోహిత్​పై వేటు తప్పదా?
X
ఐపీఎల్​ చరిత్రలో తిరుగులేని జట్టు ఏదైనా ఉందా అంటే అది ముంబై ఇండియన్స్​ మాత్రమే. ఎక్కువ సార్లు చాంపియన్​ గా నిలిచి చరిత్ర సృష్టించింది ఈ జట్టు. ఆరంభంలో తడబడటం ఆ తర్వాత చెలరేగి ఆడటం ‘ముంబై ఇండియన్స్’​ స్టయిల్​. ఈ సారి కూడా అదే ధీమాతో రంగంలోకి దిగింది రోహిత్​ సేన. అద్భుతమైన బ్యాట్స్​మెన్లు, ప్రత్యర్థులకు చెమటలు పట్టించగల ఫీల్డర్స్ ఆ జట్టు సొంతం. అయితే ఆ సారి ఎందుకో ఈ జట్టు కాస్త వెనకబడ్డట్టు అనిపిస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్​ లో ఢిల్లీ క్యాపిటల్స్​ బౌలింగ్​ దెబ్బకు ముంబై ఇండియన్స్​ బ్యాట్స్​మెన్​ విలవిల లాడిపోయారు. చాలా తక్కువ స్కోర్​ చేశారు. చివరకు ఢిల్లీ క్యాపిటల్స్​ గెలుపును నమోదు చేసుకున్నది.

చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న రాత్రి ముంబై ఇండియన్స్​, ఢిల్లీ కేపిటల్స్ తలపడ్డ విషయం తెలిసిందే. స్పిన్నర్ అమిత్ మిశ్రా అదరగొట్టాడు. వరసగా ముంబై బ్యాట్స్​మెన్లను
పెవిలియన్ పంపించాడు.

అమిత్​ మిశ్రా దాటికి ముంబై బ్యాట్స్​మెన్లు విలవిలలాడిపోయారు.

ఈ మ్యాచ్​ లో ఓడిపోవడమే కాదు.. రోహిత్​ కు మరో నష్టం కూడా కలిగింది. స్లో ఓవర్​ రేట్​ కారణంగా అతడు రూ. 12 లక్షలు ఫైన్​ కట్టాల్సి వచ్చింది.

ఈ ఐపీఎల్ సీజన్‌ లో ఇది రెండో జరిమానా.

ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెత్తిన 12 లక్షల రూపాయల ఫైన్ పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌ లో ఆడిన తొలి మ్యాచ్‌ లోనే ఎంఎస్ ధోనీ ఫైన్ కట్టాడు.మరోసారి స్లోయర్ ఓవర్ రేట్‌ను నమోదు చేస్తే.. రోహిత్ శర్మకు పడే జరిమానా రెట్టింపు అవుతుంది. అదే సమయంలో ఆ మ్యాచ్‌ ను ఆడిన 11 మంది క్రికెటర్లకు కూడా ఫైన్ మొత్తాన్ని వర్తింపజేస్తారు నిర్వాహకులు. ఇక మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్​ను నమోదు చేస్తే.. కెప్టెన్​ కు ఓ మ్యాచ్​ కు వేటు పడే అవకాశం కూడా ఉంది.