Begin typing your search above and press return to search.

ప్రజలను గాలికి వదిలేశారా.. హైకోర్టు సీరియస్

By:  Tupaki Desk   |   20 July 2020 3:35 PM GMT
ప్రజలను గాలికి వదిలేశారా.. హైకోర్టు సీరియస్
X
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా పరీక్షలు, సమాచారం వెల్లడి తీరుపై ఫైర్ అయ్యింది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పదే పదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్కటి కూడా అమలు కావడం లేదని హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ, ఏపీ వంటి రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల్లో తెలంగాణ చాలా వెనుకబడి ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఓ వైపు కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని.. ప్రజలను గాలికి వదిలేశారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.బులిటెన్, బెడ్ల వివరాలపై అధికారులు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడింది.

కరోనా విషయంలో హైకోర్టు తెలంగాణను అభినందించిందని పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మొట్టి కాయలు వేస్తుంటే అభినందించినట్టు ప్రజలను ఎలా తప్పుదోవపట్టిస్తారని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.