Begin typing your search above and press return to search.

ఏపీలో గణేష్ ఉత్సవాలపై హైకోర్టు కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   9 Sep 2021 12:48 PM GMT
ఏపీలో గణేష్ ఉత్సవాలపై హైకోర్టు కీలక నిర్ణయం
X
గణేష్ ఉత్సవాలు.. ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రగిలించాయి. ఏపీ ప్రభుత్వం బహిరంగంగా గణేష్ మండపాలు, ఉత్సవాలను కోవిడ్ నిబంధనల కారణంగా నిషేధించింది. దీంతో ఏపీ ప్రభుత్వంపై అటు బీజేపీ, టీడీపీ, తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. వెంటనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని.. ఇతర రాష్ట్రాల్లో వలే ఏపీలోనూ అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయంగా వేడి రగిల్చింది.

ఆంధ్రప్రదేశ్ లో వినాయక ఉత్సవాలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ ప్రదేశాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతించలేమని స్పష్టం చేసింది. కరోనా దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటు సరికాదని ధార్మిక పరిషత్ దాఖలు చేసిన పిటీషన్ పై విచారణలో కోర్టు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా నిన్న ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు గణేష్ బహిరంగ ఉత్సవాలపై కోవిడ్ నిబంధనల పేరిట ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.. అయితే నిన్న హైకోర్టులో కొందరు దీనిపై పిటీషన్లు వేశారు. ఏపీలోని ప్రైవేటు స్థలాల్లో బయట వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాల దాఖలైన లంచ్ మోషన్ పిటీషన్ పై హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేటు స్థలాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని.. నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే కోవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు హైకోర్టు సూచించింది. ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో కేవలం విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాల్చింది.