Begin typing your search above and press return to search.

షాంపూ బాటిల్స్ లో రూ.50కోట్ల హెరాయిన్ ..ఎలా దొరికారంటే ?

By:  Tupaki Desk   |   11 Aug 2021 9:30 AM GMT
షాంపూ బాటిల్స్ లో రూ.50కోట్ల హెరాయిన్ ..ఎలా దొరికారంటే ?
X
దొంగకి సవాలక్ష దారులు అన్నట్టుగా డ్రగ్స్ దందా చేసే వారు రోజుకో కొత్త రకం ఐడియా తో ముందుకు వస్తున్నారు. ఎంతమంది అధికారులు , ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా దేశంలో యథేచ్ఛగా డ్రగ్స్ ను తీసుకొస్తున్నారు. అయితే , తాజాగా ఓ ముఠా ను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. శ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు ఎనిమిది కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.53కోట్ల విలువ ఉంటుందని అంచనా. అరెస్టయిన ఇద్దరూ టెహ్రాన్‌ నుంచి దుబాయి మీదుగా భారత్‌కు వచ్చారని, ఆఫ్ఘన్‌ జాతీయులని అధికారులు తెలిపారు.

కాగా, హెరాయిన్‌ ను 30 కలర్‌ బాటిల్స్‌, రెండు షాంపూ బాటిళ్ల ద్వారా స్మగ్లింగ్‌ చేస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికి అనుమానం రాకుండా నిందితులు షాంపూ బాటిళ్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. ఇద్దరు ప్రయాణికులపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా ఈ వ్యవహారం బయటపడిందని అధికారులు తెలిపారు. అదే సమయంలో 14 కేసుల్లో 18 మంది విదేశీయులు, ఇద్దరు భారతీయులను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదిలాఉంటే,

ఇటీవల కాలంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు రూ.600 కోట్లకుపైగా విలువైన హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. దాదాపు ఇప్పటివరకు14 కేసులు నమోదు కాగా.. 18 మంది విదేశీయులు, ఇద్దరు భారతీయులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.