Begin typing your search above and press return to search.

పవన్ పై రాజశేఖర్ సంచలన కామెంట్స్

By:  Tupaki Desk   |   25 May 2019 10:05 AM GMT
పవన్ పై రాజశేఖర్ సంచలన కామెంట్స్
X
పవన్ కళ్యాన్ రెండు స్థానాల్లో ఓడిపోవడంపై నటుడు రాజశేఖర్ స్పందించారు. ఆయన ఓటమి చూస్తే జాలేసిందని.. పాపం పవన్.. ఒక్క సీటైనా గెలవాల్సింది ఉండేదని సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో జీవితతో కలిసి విలేకరులతో మాట్లాడిన రాజశేఖర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

గాజువాకలో తాము పవన్ కళ్యాణ్ ను ఓడించాలని ప్రయత్నించలేదని.. వైసీపీ పార్టీ ప్రచారంలో ఇచ్చిన లిస్ట్ లో గాజువాక కూడా ఉండడంతో అక్కడికెళ్లి ప్రచారం చేశాము తప్పితే పవన్ ను ఓడించాలని కాదని రాజశేఖర్ వివరణ ఇచ్చారు. ‘మా’ ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపిన నాగబాబు పోటీచేసిన నర్సాపురానికి.. ఆ పార్లమెంట్ పరిధిలో పవన్ పోటీచేసిన భీమవారంలో ప్రచారానికి తాము వెళ్లలేదన్నారు. తమకు సహకరించిన నాగబాబుపై అభిమానంతో ఇలా చేశామన్నారు. కానీ గాజువాకకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీలో చేరగానే వాల్లు కొన్ని చోట్ల ప్రచారానికి వాళ్లు లిస్ట్ ఇచ్చారని దాని ప్రకారమే వెళ్లాల్సి వచ్చిందన్నారు.

ఇక ప్రజారాజ్యం టైంలో చిరంజీవితో తనకు జరిగిన వివాదం ఐదేళ్ల వరకూ తీరలేదని రాజశేఖర్ తెలిపారు.. అప్పుడు ఎంతో రచ్చ జరిగిందన్నారు . ఇక పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 5 ఏళ్లు అయినా.. తాను ఆయనపై జనసేనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాజశేఖర్ వివరణ ఇచ్చారు.

అయితే పవన్ మాత్రం తన గబ్బర్ సింగ్ సినిమాలో తన క్యారెక్టర్ ను అవమానించేలా అల్లరి చేయించి అనుకరింపచేశాడని.. దానిపై కూడా తాను కామెంట్ చేయలేదని రాజశేఖర్ వాపోయారు. వైసీపీ పార్టీ కోసమే తాను గాజువాకలో ప్రచారం చేశానని.. అంతకుమించి ఏమీ లేదన్నారు. అయితే తోటి సినిమా నటుడిగా పవన్ రెండు చోట్ల ఓడిపోవడం మాత్రం జాలేసిందన్నారు.

మొన్న పవన్ ఓడిపోయాక ఇచ్చి స్టేట్ మెంట్ చూసి తనకు చాలా బాధేసిందని.. అంత దీనంగా పవన్ మాట్లాడాకా ఆయన ఒక్క సీట్లో అయినా గెలిచి ఉంటే బాగుండేదని అనిపించిందని రాజశేఖర్ తెలిపారు. భీమవరంలో గెలుస్తాడనుకున్నామని.. కానీ అది మన చేతుల్లో లేదని.. తోటి సినిమా వాడిగా గెలిస్తే బాగుండు అని రాజశేఖర్ చెప్పుకొచ్చాడు.