Begin typing your search above and press return to search.

మార్స్​ పైకి హెలిక్యాప్టర్​.. ఏం చేయబోతుందంటే..!

By:  Tupaki Desk   |   5 April 2021 6:30 AM GMT
మార్స్​ పైకి హెలిక్యాప్టర్​.. ఏం చేయబోతుందంటే..!
X
అరుణ గ్రహం (మార్స్​) పై పరిశోధనలు కొత్త కాదు. ఇక్కడ మానవ మనుగడకు అవకాశం ఉందా? అనే విషయాలు తెలుసుకొనేందుకు అనేక ప్రయోగాలు సాగుతున్నాయి. అయితే మార్స్​ అంతర్భాగంలో నీటి జాడ ఉన్నట్టు ఇప్పటికే పరిశోధనలో తేలింది. ఇదిలా ఉంటే ఇటీవల మార్స్​ పై నాసా పరిశోధనలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 18న మార్స్​ పైకి పర్సీవరెన్స్​ రోవర్​ దిగింది. అయితే తాజాగా అరుణగ్రహంపైకి ఓ మినీ హెలీక్యాప్టర్​ వెళ్లింది. ఈ హెలిక్యాప్టర్​ ఎందుకు వెళ్లింది. అక్కడ ఏం చేయబోతున్నది తదితర విషయాలను నాసా వెల్లడించింది.

నాసా కు చెందిన ఇంజెన్యూటీ మినీ హెలికాప్టర్ మార్స్‌పైకి వెళ్లింది. దాదాపు 47 కోట్ల కిలోమీటర్ల పాటు నాసా పర్వీవరెన్స్ రోవర్ తోపాటు ఈ హెలీక్యాప్టర్​ ప్రయాణం చేసింది. ఆదివారం రోవర్ ఉదర భాగం నుంచి మార్స్ ఉపరితలంపైన దిగింది. నాసాకు చెందిన జెట్ ప్రపల్టన్ లేబోరేటరీ(జేపీఎల్) ఆదివారం ఈ మేరకు ఈ ట్వీట్​ చేసింది. మార్స్ పైన దిగిన ఈ మినీ హెలిక్యాప్టర్​ కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్​ చేసింది నాసా. పర్సీవరెన్స్ పవర్ సిస్టంను సాయంతో ఈ హెలీక్యాప్టర్​ పనిచేయనున్నది. దీనికి సొంత బ్యాటరీ కూడా ఉంది.

సాధారణంగా అరుణ గ్రహంపై రాత్రి వేళల్లో మైనస్ 90 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ హెలీక్యాప్టర్​ ఎంతమేరకు పనిచేస్తుందో వేచి చూడాలి అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ హెలీ క్యాప్టర్​ అరుణ గ్రహంపైకి వెళ్లి.. అక్కడ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేయనున్నది. అంతేకాక అక్కడ గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ. కాబట్టి ఈ హెలీక్యాప్టర్​ అక్కడ ఎగరగలుగుతోందో లేదో కూడా వేచి చూడాలి. అయితే ఈ హెలీక్యాప్టర్​ భూమి మీదకు వచ్చాక పలు ఆసక్తికరమైన విషయాలు తెలియనున్నాయి. అక్కడి వాతావరణ పరిస్థితులపై మరింత అంచనా వచ్చే అవకాశం ఉన్నది.