Begin typing your search above and press return to search.

ఈ ఐఏఎస్ నిజాయితీకి గుర్తింపు..53వ బ‌దిలీ

By:  Tupaki Desk   |   28 Nov 2019 1:03 PM GMT
ఈ ఐఏఎస్ నిజాయితీకి గుర్తింపు..53వ బ‌దిలీ
X
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ దందాలను ప్రశ్నించడం ద్వారా వార్తల్లోకెక్కిన చండీగఢ్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా మ‌ళ్లీ సంచ‌ల‌న ప‌రిణామాల‌తో తెర‌కెక్కారు. నిక్కచ్చి ఐఏఎస్‌ అధికారిగా పేరొందిన అశోక్‌ ఖేమ్కాకు మ‌ళ్లీ బదిలీ అయింది. హ‌ర్యానా ప్రభుత్వంలో క్రీడలు - యువజన వ్యవహారాల విభాగంలో 15 నెలలు పనిచేసిన అశోక్‌ ఈ ఏడాది మార్చిలోనే శాస్త్ర సాంకేతిక విభాగానికి ప్రత్యేక కార్యదర్శిగా బదిలీపై వచ్చారు. తాజాగా మళ్లీ పురావస్తు విభాగానికి బదిలీఅయ్యారు. 28 ఏళ్ల విధి నిర్వహణలో ఆయనకిది 53వ బదిలీ.

కాంగ్రెస్‌ నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రాకు చెందిన స్కైలై ట్‌ హాస్పిటాలిటీ - ప్రముఖ రియల్ ఎస్టేట్‌ డెవలపర్‌ డీఎల్ ఎఫ్‌ మధ్య ఒప్పందం జరిగిన భూమి మ్యుటేషన్‌ ను 2012లో అశోక్‌ ఖే మ్కా రద్దుచేయటం సంచలనం సృష్టించింది. అక్రమంగా రద్దు చేశారంటూ ఖేమ్కాపై నాడు కాంగ్రెస్ ప్రభుత్వం చార్జిషీటు నమోదు చేసింది - ప‌ద‌వి నుంచి బ‌దిలీ చేసింది.అశోక్ ఖేమ్కా ఏ పదవిలోనూ ఏడాది పూర్తి చేయలేదు. హర్యానాలో నాడు ఖేమ్కాను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ - అధికారంలోకి రాగానే ఆయనను అడ్డు తొలగించుకుంది. కొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ - నేడు అధికారంలోకి రాగానే ఆయనను అడ్డు తొలగించుకుంది. రవాణాశాఖ కమిషనర్‌ గా ఉన్న ఖేమ్కాను ప్రాధాన్యం లేని పురావస్తు శాఖ - మ్యూజియంల విభాగానికి బదిలీ చేసింది. అనంతరం యువ‌జ‌న వ్య‌వ‌హారాల‌కు మార్చింది. ఇందులో 15నెల‌లు ప‌నిచేసిన అనంత‌రం తాజాగా మ‌ళ్లీ బ‌దిలీ చేసింది.

త‌న‌కు జ‌రిగిన తాజా బ‌దిలీపై ఖేమ్కా ఎప్ప‌ట్లాగే ట్విట్ట‌ర్ లో త‌న అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ పరిణామం చాలా బాధాకరం అని ఖేమ్కా తన బదిలీపై స్పందించారు. ‘మళ్లీ బదిలీ చేశారు. ఇక్కడ ఎలాంటి ప్రగతి లేకుండానే మళ్లీ మొదటికొచ్చాను. రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొన్న మరుసటి రోజే.. సుప్రీంకోర్టు ఆదేశాలు - నిబంధనలు మరోసారి ఉల్లంఘనకు గురయ్యాయి. కొందరిని సంతృప్తపరిచేందుకు నన్ను చివరి మూలకు నెట్టేశారు. ఈ అవమానం నిజాయితీకి బహుమానం’ అని అశోక్‌ ఖేమ్కా వాపోయారు.