Begin typing your search above and press return to search.

ఒక‌రి ప్రాణాన్ని తీసిన జీవీఎల్ కారు!

By:  Tupaki Desk   |   25 Aug 2018 4:48 AM GMT
ఒక‌రి ప్రాణాన్ని తీసిన జీవీఎల్ కారు!
X
ఏపీ అధికార పక్షం మీదా.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీదా ఒంటికాలి మీద విరుచుకుప‌డే బీజేపీ నేత‌ల్లో జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ఒక‌రు. తన మాట‌లు ఏపీకి..మ‌రి ముఖ్యంగా ఆంధ్రోళ్ల‌కు న‌ష్ట‌మా.. లాభ‌మా అన్న విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీ ప్ర‌యోజ‌నానికి పెద్ద పీట వేస్తూ ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్య‌లు చేయ‌టం జీవీఎల్ కు మొద‌ట్నించి అల‌వాటు.

తాజాగా ఆయ‌న ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు కార‌ణంగా ఒక‌రు ప్రాణాలు కోల్పోయిన వైనం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో మ‌రో మ‌హిళ‌కు తీవ్ర గాయాల‌య్యాయి. బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరు జిల్లాలో ప‌ర్య‌టించారు.

శుక్ర‌వారం సాయంత్రం గుంటూరు జిల్లా కొల‌నుకొండ వ‌ద్ద రోడ్డు దాటుతున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల్ని.. అదుపు త‌ప్పిన బీజేపీ ఎంపీ కారు ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒక మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా.. మ‌రో మ‌హిళ తీవ్ర గాయాల పాల‌య్యారు. ఆమెను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేస్తున్నారు.

ఒక‌రి ప్రాణాలు పోవ‌టానికి కార‌ణ‌మైన కారులో ఎంపీ జీవీఎల్ ఉన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన అనంత‌రం మ‌రో కారులో ఆయ‌న విజ‌య‌వాడ వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఒక‌రి ప్రాణాలు పోవ‌టానికి కార‌ణ‌మైన డ్రైవ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.