Begin typing your search above and press return to search.

జగన్ ఊఁ అంటే చాలు.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా!

By:  Tupaki Desk   |   12 Jan 2020 4:43 PM GMT
జగన్ ఊఁ అంటే చాలు.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తా!
X
సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలు తాను టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. అనంతపురంలో పర్యటనకు చంద్రబాబు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేశారు. జీవితకాలంలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పర్యటనకు వస్తారని ఆయన బాబు పేరు వింటేనే సీమవాసులు మండిపడుతున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు. సీఎం జగన్ సరేనంటే తాను చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటానన్న ఆయన చంద్రబాబు ముఖం పగలగొట్టడానికి రాయలసీమ ప్రజలు రెడీగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు పోలీసులు ఎన్ని ఆటంకాలు కలగజేసినా.. చంద్రబాబు పర్యటనలో పాల్గొంటానని చెప్పిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. ‘‘ఒకరేమో రాయలసీమను వెనుకబాటుకు గురిచేశారు. ఇంకొకరేమో పోలీసులతో బూట్లు నాకిస్తానని పిచ్చికూతలు కూశారు. సీఎం అనుమతిస్తేగనుక వీళ్లిద్దరినీ నేనే అడ్డుకుంటా''అని ఫైరయ్యారు.

కాగా జేసీ- గోరంట్ల మధ్య ఎన్నికలకు ముందు నుంచి ఘర్షణ వాతావరణం ఉండడంతో అనంతపురంలో టీడీపీ నేతల పర్యటన సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడవచ్చన అంచనాలతో పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.