Begin typing your search above and press return to search.

ఆ మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీ కొల్లగొట్టాడట.. గోనె చెప్పిన నిజాలు?

By:  Tupaki Desk   |   3 Oct 2022 12:30 AM GMT
ఆ మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీ కొల్లగొట్టాడట.. గోనె చెప్పిన నిజాలు?
X
వైఎస్ఆర్ హయాంలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేతల్లో గోనె ప్రకాష్ రావు ఒకరు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ లో ఇమడలేక ఈయన సైలెంట్ అయిపోయారు. బాగా నోరున్న నేతగా.. ఫైర్ బ్రాండ్ గా ఈయనకు పేరుండేది. తాజాగా లేట్ గా అయినా లేటెస్ట్ గా అవినీతిని తవ్వితీసే పనిలో ఈయన పడ్డారు. అప్పట్లో ఓ కలెక్టర్ తో పెట్టుకున్న గోడె తాజాగా ఎమ్మెల్యేల అక్రమాల గురించి మాట్లాడి సంచలనం సృష్టించారు. ‘మంత్రి బావ’ అంటూ హాట్ కామెంట్స్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి బావ రూ.8 కోట్ల ప్రాపర్టీని ఆక్రమించారని గోనె ప్రకాష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యేల అరాచకాలు చూస్తే తనకే చంపాలని అనిపిస్తోందని మండిపడ్డారు. కోల్ బెల్ట్ ప్రాంతం రామగుండం, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలకు మావోయిస్టుల హెచ్చరికలు వచ్చాయని.. మెడికల్, ఉద్యోగాల మాఫియాపై మావోయిస్టులు సీరియస్ గా ఉన్నారని వివరించారు.

ఎమ్మెల్యేల ఆక్రమాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని కామెంట్ చేశారు. ఆ ఆధారాలకు సీఎం కేసీఆర్ కు పంపిస్తామని బాంబ్ పేల్చారు. ఎమ్మెల్యేల అక్రమాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నానని కామెంట్ చేశారు. ఆ ఆధారాలకు సీఎం కేసీఆర్ కు పంపిస్తానని బాంబు పేల్చారు.

గోనె ప్రకాష్ రావు కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఆ ఆధారాలకు సీఎం కేసీఆర్ కు పంపిస్తానని బాంబు పేల్చారు. గోనె ప్రకాష్ రావు ఇలా మళ్లీ యాక్టివ్ కావడం.. మంటపెట్టేలా వ్యాఖ్యలు చేయడంతో ఈసారి ఎవరికి మూడుతుందోనన్న ఆందోళన నెలకొంది.

కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో నక్సల్స్ లేఖలు రాశారని గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నక్సల్స్ బలహీన పడ్డారని ఆరోపించారు.

గోనె ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత. వైఎస్ఆర్ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా చేశారు. నాడు వైఎస్ఆర్ నమ్మినబంటుగా టీఆర్ఎస్ సహా ఇతర పక్షాలపై విరుచుకుపడేవారు. ఇప్పుడు మళ్లీ ఆయన మొదలుపెట్టారు.