Begin typing your search above and press return to search.

షాకింగ్ స్మగ్లింగ్ ఐడియా: జీన్స్ పై బంగారం పెయింటింగ్..

By:  Tupaki Desk   |   31 Aug 2021 5:30 AM GMT
షాకింగ్ స్మగ్లింగ్  ఐడియా: జీన్స్ పై బంగారం పెయింటింగ్..
X
దేశంలోకి ప్రవేశించే మనుషులు, వస్తువులను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు కస్టమ్స్ అధికారులు.. బంగారం,, డబ్బును అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడం అసాధారణం కాదు. స్మగ్లర్లు స్మగ్లింగ్ చేయడానికి వారి విచిత్రమైన.. వినూత్నమైన ఆలోచనలు అమలు పరుస్తారు. అలా ఎన్నో సార్లు చిక్కుకున్న అనేక సంఘటనలను మనం చూశాము, కానీ ఇక్కడ స్మగ్లర్లు ఆలోచించిన విధానం నెక్ట్స్ లెవల్ గా ఉంది.

ఈ కొత్త స్మగ్లర్లు బంగారాన్ని భారతదేశానికి స్మగ్లింగ్ చేయడానికి అమలు చేసే ఆలోచన చూసి అధికారులే అవాక్కయ్యారు. ఒక స్మగ్లర్ బంగారాన్ని సన్నని పొరగా చేసి తన ప్యాంటు లోపలి భాగంలో పెయింట్ చేశాడు.

కన్నూర్ ఎయిర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు కేరళ విమానాశ్రయంలో ఒక వ్యక్తినుంచి 14 లక్షల రూపాయల విలువైన 302 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించగా పట్టుకున్నారు. అతను బంగారాన్ని కరిగించి పెయింట్ పేస్ట్ లాగా చేసి ప్యాంటు లోపలి భాగంలో పూసాడు.

బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ఈ షాకింగ్ ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

స్మగ్లర్లు స్మగ్లింగ్‌లో వింత పద్ధతులను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. ఇటీవల, షార్జా నుండి అమృత్ సర్ వెళ్తున్న ఒక వ్యక్తి తన ఇన్నర్లలో రూ .78 లక్షల రూపాయల విలువైన 1894 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అరెస్టు అయ్యాడు. తాజాగా జీన్స్ ప్యాంట్ కు పూసి తీసుకురావడం ఆశ్చర్యపరిచింది.