Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల.. వారు వీరే!

By:  Tupaki Desk   |   19 Nov 2020 5:33 PM GMT
టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల.. వారు వీరే!
X
జీహెచ్ఎంసీ ఎన్నికలపై దూకుడుగా ముందుకెళుతున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అదే ఊపులో నిన్న 105మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఈరోజు మరో 20 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. బల్దియాలో మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఇప్పటికీ 125 దివిజన్లకు అభ్యర్థులను ప్రకటించడం విశేషం. మరో 25మంది అభ్యర్థుల పేర్లను ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది.బీజేపీ, కాంగ్రెస్ లు ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండడం విశేషం.

మొదటి జాబితాలో సిట్టింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. రెండో జాబితాలో కొంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం విశేషం. తాజాగా ప్రకటించిన 20 మంది అభ్యర్థులలో సికింద్రాబాద్ లో మూడు డివిజన్లు కొత్త వారికి ఇచ్చారు. కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు నిరాకరించి కొత్త వారికి ఇవ్వడం విశేషం. మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి టికెట్ ఆశిస్తున్న చర్లపల్లి స్థానం ఇంకా పెండింగ్ లో ఉండడం సంచలనంగా మారింది. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య, అంబర్ పేట ఎమ్మెల్యే భార్యకు ఇంకా సీట్లు కేటాయించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

*టీఆర్ఎస్ రెండో జాబితా ఇదే.. (20మంది)
1. కూకట్‌పల్లి- సత్యనారాయణ జూపల్లి
2.బాలానగర్‌- రవీందర్‌రెడ్డి
3. షేక్‌పేట్‌- సత్యనారాయణ యాదవ్‌
4.శేరిలింగంపల్లి- రాగం నాగేందర్
5.హిమాయత్‌నగర్‌- హేమలత యాదవ్
6.బేగంపేట్‌- మహేశ్వరి శ్రీహరి
7.మెట్టుగూడ- రాసూరి సునీత
8.వినాయక్‌నగర్‌- బద్ధం పుష్పలతరెడ్డి
9. మల్లాపూర్‌- దేవేందర్‌రెడ్డి
10. రామాంతపూర్‌- జోత్స్న
11. అడ్డగుట్ట- ప్రసన్న లక్ష్మి
12. వివేకానందనగర్‌ కాలనీ- రోజా రంగారావు
13.బేగంబజార్‌- పూజా వ్యాస్‌ బిలాల్
14.సులేమాన్‌ నగర్‌- సరితా మహేష్‌
15.శాస్త్రిపురం- రాజేష్‌యాదవ్‌
16.రాజేంద్రనగర్‌- శ్రీలత
17. బాగ్‌అంబర్‌పేట- పద్మావతి రెడ్డి
18. భోలక్‌పూర్‌- నవీన్‌కుమార్‌
19.బౌద్ధనగర్‌- కంది శైలజ
20. మైలార్‌దేవ్‌పల్లి- ప్రేమ్‌దాస్‌ గౌడ్‌