Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : నంద్యాలలో ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ఒకరి మృతి!!

By:  Tupaki Desk   |   27 Jun 2020 6:15 AM GMT
బ్రేకింగ్ : నంద్యాలలో ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్: ఒకరి మృతి!!
X
ఏపీలో మరో దుర్ఘటన జరిగినట్టు సమాచారం అందుతుంది. ఈ మద్యే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ లో విషవాయువు లీక్ అయ్యి ..సుమారుగా ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారుగా 12 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వందలమంది విషవాయువు ప్రభావానికి లోనైయ్యారు.

తాజాగా నంద్యాలలో జకీయ నేత ఎస్పీవై రెడ్డికి చెందిన ఫ్యాక్టరీలో గ్యాస్ లీకైంది... ఫ్యాక్టరీలో అమ్మోనియా లీకై ఒకతను మరణించాడు....చాలామంది ఆ విష వాయువు ప్రభావానికి మూర్ఛపోయి కిందపడిపోయారని ప్రాధమిక సమాచారం. వీరిని హాస్పిటల్ కి తరలిస్తున్నట్టు తెలుస్తుంది, అయితే , దీనిపై ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ ఘటన పై ఒక స్పష్టత రావాలి అంటే ..ప్రభుత్వం కానీ ..ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు ఉన్న ప్రాధమిక సమాచారం ఇది ...మరింత సమాచారం కోసం ...చూస్తూనే ఉండండి తుపాకీ.com