Begin typing your search above and press return to search.

గాంధీలో సిబ్బంది నిర్లక్ష్యం ... డెడ్‌‌ బాడీలు తారుమారు !

By:  Tupaki Desk   |   10 Jun 2020 1:30 PM GMT
గాంధీలో సిబ్బంది నిర్లక్ష్యం ... డెడ్‌‌ బాడీలు తారుమారు !
X
తెలంగాణలో వైరస్ పేషేంట్స్ కి సంజీవినిగా మారిన హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి మరోసారి సంచలనంగా మారింది. ఈసారి ఏమైందంటే ..హాస్పిటల్ ‌లో చనిపోయిన పేషెంట్ల డెడ్ బాడీలు తారుమారయ్యాయి. ఆ శవాన్ని అయన బంధువులు శ్మశానం దాకా తీసుకెళ్లాక ఈ తప్పును గుర్తించారు. దీనితో వెంటనే .. ఆ బాడీని గాంధీ హాస్పిటల్‌ కు తీసుకొచ్చేశారు. తర్వాత, అధికారులు వాళ్లకు సంబంధించి వ్యక్తి డెడ్ బాడీని గుర్తించి వారికీ అప్పగించారు.

హైదరాబాద్‌ లోని బేగంపేట గురుమూర్తినగర్ ‌కు చెందిన ఓ కరోనా పేషేంట్ మంగళవారం గాంధీలో చనిపోయారు. హాస్పిటల్ స్టాఫ్ డెడ్ బాడీని బంధువులకు అప్పగించగా.. వాళ్లు శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.

కడసారి చూసేందుకు ఆ వ్యక్తి భార్య డెడ్ బాడీ మొఖం చూసి షాక్ అయ్యింది. ఆ డెడ్ బాడీ ని తన భర్తది కాదని గుర్తించింది. దీనితో ఆ డెడ్ బాడీని తిరిగి అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్ మార్చురీకి తీసుకొచ్చారు. డాక్టర్లు, హెల్త్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మార్చురీలో వాళ్లకు సంబంధించిన వ్యక్తి బాడీని గుర్తించడంతో శాంతించారు. గాంధీ హాస్పిటల్‌కు భారీగా కరోనా పేషెంట్లు వస్తుండటంతో.. డాక్టర్లు, స్టాఫ్ పై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని, ఆ క్రమంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అంటున్నారు.