Begin typing your search above and press return to search.

ధోనీ గురించి గంభీర్​ సంచలన ట్వీట్ పెట్టాడు

By:  Tupaki Desk   |   17 April 2021 6:36 AM GMT
ధోనీ గురించి గంభీర్​ సంచలన ట్వీట్ పెట్టాడు
X
గౌతమ్​ గంభీర్​ సంచలనాలకు కేరాఫ్​ గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మ్యాచ్​ ఓడిపోయిన సందర్భంలో ఐపీఎల్​ టైంలో తన తోటి ఆటగాళ్ల ప్రదర్శన తీరును గంభీర్​ ఉతికి ఆరేస్తుంటాడు. మొహమాటం ఏమీ లేకుండా ఏకీ పారేస్తాడు. ఇప్పటికే పలు మార్లు సీనియర్​ క్రికెటర్లు కోహ్లీ, ధోనికి కౌంటర్లు ఇచ్చాడు.తాజాగా మరోసారి మహేంద్ర సింగ్​ ధోనీ పై పడ్డాడు. అతడి ఆట తీరుపై తనదైన స్టయిల్​ లో కౌంటర్లు ఇచ్చాడు.

‘ధోనీ గతంలో మాదిరిగా ఇప్పుడు మ్యాచ్​ ఫినిషర్​ కాదు. అతడు కాస్త ముందుగా వచ్చి పరుగులు తీయాలి. సీఎస్​కే ప్లేయర్స్​ లో ఆశలు రేకెత్తించాలి. అంతేగానీ ఏడో బ్యాట్స్​మన్​ గా, ఆరో బ్యాట్స్​మన్ ​గా వస్తే లాభం ఏమిటి’ అంటూ కాస్త ఘాటుగా కౌంటర్లు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్​మీడియాలో వైరల్​ గా మారాయి.

అంతర్జాతీయ క్రికెట్​ కు గుడ్​బై చెప్పిన మహీ .. ఐపీఎల్​ లో మాత్రం కొనసాగుతున్నాడు. సీఎస్​కే జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. అయితే గత రెండు సీజన్లుగా మహీ నుంచి ఆశించిన స్థాయిలో ఆటతీరు కనిపించడం లేదు. మరోవైపు ఆ జట్టులోని ఇతర ప్లేయర్స్ కూడా పెద్దగా రాణించడం లేదు. ఒకప్పుడు టాప్​ జట్టుగా ఉన్న చెన్నై సూపర్​కింగ్స్​ ప్రస్తుతం ఫామ్​ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. దీంతో సీఎస్​కే ఫ్యాన్స్​ తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.

నిన్న సీఎస్​కే .. పంజాబ్​ కింగ్స్​తో తలపడింది. ఎట్టకేలకు ఓ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో గంభీర్​ సంచలన ట్వీట్ పెట్టాడు. గత సీజన్‌ లో 14 మ్యాచ్‌లాడిన ధోని 200 పరుగులు సాధించాడు. ఫలితం.. ఐపీఎల్‌ చరిత్రలో సీఎస్‌కే జట్టు తొలిసారి ప్లేఆఫ్‌ కు అర్హత సాధించలేకపోయింది.

ప్రస్తుతం సీఎస్​కే కష్టాల్లో కూరుకుపోయి ఉంది. బౌలర్లు, బ్యాట్స్​మెన్లు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం లేదు. దీంతో ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. ఓ దశలో మహీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై ఇటు ధోనీ.. గానీ అటు జట్టు యాజమాన్యం గానీ అధికారిక ప్రకటన రాలేదు. ఈ సారైనా సీఎస్​కే జట్టు ఏ మేరకే ఆడగలుగుతుందో వేచి చూడాలి.