Begin typing your search above and press return to search.

గోవాలో క్యాంప్.. ఎమ్మెల్సీ ఓటర్ల ఫుల్ ఎంజాయ్

By:  Tupaki Desk   |   7 Dec 2021 2:06 AM GMT
గోవాలో క్యాంప్.. ఎమ్మెల్సీ ఓటర్ల ఫుల్ ఎంజాయ్
X
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు ఆపసోపాలు పడుతున్నాయి. ఓటర్లను క్యాంప్ లకు తీసుకెళుతూ వారి అడిగింది చేస్తున్నారు. మందు విందు గోవాలాంటి సుందర ప్రదేశాల్లో ఎంజాయ్ కోసం పంపిస్తున్నారు. అలా అందివచ్చిన అవకాశంతో ఓటర్లు ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఎవరికి వారే గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికార , విపక్ష పార్టీలు తమకు సంబంధించిన వారు, మద్దతు ఇస్తున్న వారు ఆఖరి నిమిషంలో గోడ దూకకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లను ప్రలోభాల నుంచి కాపాడుకునేందుకు కుటుంబంతో సహా ట్రిప్ లకు తరలిస్తున్నారు.

ఖమ్మం శాసనమండలి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటర్లను గోవా క్యాంప్ నకు తరలించారు. తాజాగా గోవా క్యాంపులో ఖమ్మం ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఓటర్లు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

సాధారణ నేతలతోపాటు ఎమ్మెల్యేలు సైతం డ్యాన్స్ లు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక గోవాటూర్ లో భాగంగా ఒక భారీ షిప్ లో ఓటర్ల కోసం స్పెషల్ ట్రిప్ ఏర్పాటు చేశారు. ఈ ఓడలో వెళ్లిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఓటర్లతో కలిసి ఇలా ఆడిపాడి అలరించారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని ఓటర్లు జన్మలో చూడని ఎంజాయ్ మెంట్ ను చేస్తున్నారు.

గోవాలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు రెండు వారాల పాటు క్యాంపు పెట్టగా ఇప్పటికే 10రోజులు పూర్తయ్యింది. పోలింగ్ కు ముందు రోజు గోవా నుంచి హైదరాబాద్ కు వచ్చి అక్కడి నుంచి పోలింగ్ రోజు ఖమ్మంకు చేరుకుంటారు.