Begin typing your search above and press return to search.

న‌యీమ్ కేసు పై గవర్నర్ ‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెర్స్‌ లేఖ !

By:  Tupaki Desk   |   14 Dec 2020 3:55 PM GMT
న‌యీమ్ కేసు పై  గవర్నర్ ‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెర్స్‌ లేఖ !
X
గ్యాంగ్ స్టర్ నయూమ్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ‌కు లేఖ రాసింది. న‌యీమ్‌ కేసులో 24 తుపాకులు స్వాధీనం చేసుకున్న‌ట్లు సిట్ నివేదిక ఇవ్వ‌గా, రూ.2.16 కోట్లు, రెండు కిలోల బంగారం, మూడు కిలోల వెండి ఎలా వ‌చ్చింద‌ని, దీని పై పూర్తి ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని లేఖ‌లో కోరింది.

అలాగే న‌యీమ్ ‌కు ఇన్ని ఆయుధాలు ఎలా వ‌చ్చాయ‌ని, అలాగే పోలీసు ద‌గ్గ‌ర ఉండే సామాగ్రి న‌యీమ్ ‌కు ఎలా చేరింద‌ని ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే 24 తుపాకుల్లో మూడు ఏకే47, 9 పిస్ట‌ల్స్‌, 3 రివాల్వ‌ర్లు, 7 త‌పంచాలు, ఒక బోర్ గ‌న్‌, ఒక స్టెన్ ‌గ‌న్‌, రెండు గ్ర‌నేడ్లు, జిలిటెన్స్టిక్స్ , ఐదు కిలోల అమోనియం నైట్రేట్‌, 616 కిలోల బుల్లెట్లు, 6 మ్యాక్టిన్లు, 30 డిటోనేర్లు సీజ్ చేసిన‌ట్లు ఇది వ‌ర‌కు సిట్ అందించిన నివేదిక‌లో పేర్కొంది.

అయితే ఇంత మొత్తంలో తుపాకులు, ఇత‌ర స‌మాగ్రి న‌యీమ్ ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌చ్చాయో విచార‌ణ జ‌రిపించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ‌కు ఇచ్చిన లేఖ‌లో తెలిపింది. 2016 ఆగస్టు 8న షాద్‌నగర్ సమీపంలో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నయీం చనిపోయిన ఆ తర్వాత.. అతడి చీకటి సామ్రాజ్యపు కోటలు బద్ధలయ్యాయి. నయీమ్ దందాలు.. దారుణాలు ఒక్కొక‌టిగా బ‌య‌ట‌కురావ‌డం మొద‌లైంది. ముఖ్యంగా అప్ప‌టి వ‌ర‌కు నయీమ్‌కి బ‌య‌ప‌డి త‌న గురించి కానీ, త‌న దందాలు గురించి కాని బ‌య‌ట‌కు చెప్ప‌టానికి ఇష్ట‌ప‌డిన వాళ్లంతా ఒక్కొకరుగా బయటకు వచ్చారు. న‌యీమ్ త‌మ‌ను ఎలా బెదిరించారో పోలీసులుకు చెప్ప‌డం మొద‌లు పెట్టారు. అలా బాధితుల సంఖ్య పెరుగడంతో నయీమ్ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ‌ను ఏర్పాటుచేసింది ప్రభుత్వం. అతడికి రాజకీయ నేతలు, పోలీసుల అండదండలున్నాయనే విషయం తెలిసింది. ఈ క్రమంలోనే నయీమ్‌తో సంబంధమున్న ఐదుగురు అధికారులను పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది.