Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాకు ఆధార్ లింకు లేనట్లే

By:  Tupaki Desk   |   21 Nov 2019 4:11 AM GMT
సోషల్ మీడియాకు ఆధార్ లింకు లేనట్లే
X
భారత్‌లో సోషల్ మీడియా ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో.. ఎంతగా దుర్వినియోగం చేస్తున్నారో.. ఎంతగా సద్వినియోగం చేసుకుంటున్నారో తెలిసిందే. ప్రయోజనాలతో పాటు దుష్పరిణామాలూ ఎక్కువవుతుండడంతో సోషల్ మీడియాపై నియంత్రణకు కేంద్రం ఆధార్ లింకింగ్ చేయనుందన్న ప్రచారం చాలాకాలంగా ఉంది. అయితే.. అలాంటి ప్రచారాలకు కేంద్రం పుల్ స్టాప్ పెట్టింది. షల్ మీడియా అకౌంట్లతో ఆధార్ అనుసంధానం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌ సభలో ఓ సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

కాగా.. అన్ని సోషల్ మీడియా అకౌంట్లకు ఆధార్ లేదా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఓ గుర్తింపు నంబరును లింక్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో రెండు, మధ్యప్రదేశ్, బోంబే హైకోర్టుల్లో చెరో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పందించిన ఫేస్ బుక్ అన్నీ కలసి సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ గతంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు పొందే వారి బ్యాంకు ఖాతాలకు మాత్రమే ఆధార్‌ను అనుసంధానించే అవకాశం ఉన్నందున కొత్తగా సోషల్‌ మీడియా ఖాతాలకు కూడా లింక్‌ చేయాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే.. ఆధార్‌ చట్ట ప్రకారం భారత సంచిత నిధితో సంబంధం లేని విషయాలతో ఆధార్‌ నంబరును అనుసంధానించడం కుదరడం వీలు కానందున ఆ నిర్ణయాన్ని కేంద్రం పక్కనపెట్టేసినట్లు తెలుస్తోంది.