Begin typing your search above and press return to search.

రూ.50కోట్ల విగ్రహాన్ని సీఎంకు ఇచ్చేసిన రైతు

By:  Tupaki Desk   |   19 Dec 2015 12:03 PM GMT
రూ.50కోట్ల విగ్రహాన్ని సీఎంకు ఇచ్చేసిన రైతు
X
చిన్న చిన్న మొత్తాలకే కక్కుర్తి పడిపోతున్న రోజులివి. అలాంటిది ఏకంగా రూ.50కోట్ల విలువైన వస్తువును నిజాయితీకి ప్రభుత్వానికి ఇచ్చేయటం అంత చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన పనిని చేశారు కృష్ణా జిల్లాకు చెందిన ఒక రైతు. తన వ్యవసాయ క్షేత్రంలో పొలం దున్నుతుండగా బంగారు తాపడం చేసిన పంచలోహ విగ్రహం ఒకటి బయటపడింది. ఎంతో పురాతనమైన ఈ విగ్రహానికి మార్కెట్ లో రూ.50కోట్ల విలువ ఉంటుందని పురావస్తు అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే.. ఈ విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నెల 12న కృష్ణా జిల్లా చందర్లపాడు మండలంలోని భాస్కర్ రావు అనే రైతుకు దొరికింది. ఈ అపురూపమైన విగ్రహాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రంగా అప్పజెప్పాడా రైతు. ముఖ్యమంత్రి కార్యాలయంలో చంద్రబాబును కలిసి రైతు కుటుంబ సభ్యులు.. ఈ విగ్రహానికి ప్రభుత్వానికి అందించారు. ఇంత విలువైన విగ్రహాన్ని ప్రభుత్వానికి ఇవ్వటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు.. సదరు రైతును అభినంధించారు.