Begin typing your search above and press return to search.

గర్భాన్ని చీల్చి బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళకు ఉరిశిక్ష

By:  Tupaki Desk   |   18 Dec 2020 12:30 AM GMT
గర్భాన్ని చీల్చి బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళకు ఉరిశిక్ష
X
అమెరికాలోని షికాగోలో 2004లో జరిగిన ఓ దారుణం ఇప్పటికీ స్థానికులను వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ భయం గొలుపుతూనే ఉంది. ఆ ఏడాదిలో లీసా మోంట్ గే మెరీ అనే మహిళా దారుణ ఆకృత్యానికి పాల్పడింది. ఓ గర్భిణి గొంతు నులిమి చంపి ఆమె గర్భాశయం నుంచి ఇంకా పుట్టని శిశువును దొంగలించడం అమెరికాలోనే భీతావాహ ఘటనగా మిగిలింది.

ఈ దారుణం జరిగి 16 ఏళ్లు అవుతున్నా కోర్టుల్లో విచారణ సాగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ కేసును పోలీసులు నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తాజాగా అమెరికా ప్రభుత్వం ఆ మహిళకు మరణ శిక్ష విధించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ ఘటన తర్వాత అమెరికాలో గత 20 ఏళ్ల నుంచి గర్భవతుల గర్భాశయాల నుంచి ఇంకా పుట్టని శిశువుల అపహరణ కొనసాగుతోంది. దీంతో ఈ కేసులో కఠిన శిక్ష విధించాలని నిపుణులు స్టడీ చేస్తున్నారు.

2004లో 34 ఏళ్ల లీసా ఈ దారుణానికి పాల్పడింది. ఆమెకు నలుగురు పిల్లలు అప్పటికే ఉన్నారు. డాగ్ బ్రీడర్ అయిన బాబీ అనే గర్భిణిని లీసా హత్య చేసి బిడ్డను వెలికితీసింది. రక్తపు మడుగులో ఉన్న బాబీ చనిపోయింది.

ఆ శిశువు తన శిశువు అని తన భర్తకు లీసా తెలిపింది. 2007 లీసాను కోర్టులో దోషిగా పేర్కొని మరణ శిక్ష విధించాలని తీర్పు చెప్పింది.