Begin typing your search above and press return to search.

పాత సెంటిమెంట్ ను కొనసాగించిన ఈటల సతీమణి

By:  Tupaki Desk   |   9 Oct 2021 3:30 AM GMT
పాత సెంటిమెంట్ ను కొనసాగించిన ఈటల సతీమణి
X
రాజకీయ నేతలకు ఏమున్నా లేకున్నా.. సెంటిమెంట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ‘6’ అంకె మీద ఆయనకుండే సెంటిమెంట్ అంతా ఇంతా కాదు. కీలక నిర్ణయాన్ని ఏం తీసుకున్నా సరే.. ఆరు అంకె మిస్ కాని రీతిలో ఆయనకు ఉంటుంది. ఇలా అధినేతలు మొదలు నేతల వరకు సెంటిమెంట్లు ఎక్కువగా ఉండటం కనిపిస్తుంటుంది.

తాజాగా జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ.. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ కు సంబంధించిన ఒక సెంటిమెంట్ ను ఆయన సతీమణి జుమన వెల్లడించారు. ఎన్నికఏదైనా.. ఈటల బరిలో నిలిచిన ప్రతిసారీ ఆయన నామినేషన్ తో పాటు.. తాను డమ్మీ నామినేషన్ వేయటం మామూలే అని.. ఇది ప్రతి ఎన్నికల్లోనూ అనుసరించేదే అని చెప్పారు.

ఈటల నామినేషన్ వేయగా.. ఈటల సతీమణి డమ్మీ నామినేషన్ దాఖలు చేయటంపై తాజాగా కొత్త వాదనల్ని రాజకీయ ప్రత్యర్థులు తెర మీదకు తీసుకొస్తున్నవేళ.. అది తమ సెంటిమెంట్ అన్న విషయాన్ని ఆమె వివరించే ప్రయత్నంచేశారు. మరి.. సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. ఎప్పటిలానే విజయం కూడా ఈటలనే వరిస్తుందా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదు.